గురుద్వారా రామ్సార్ సాహిబ్ అమ్రిత్సర్ కు ఆగ్నేయంగా వుంది. ఈ గురుద్వారా కూడా రామ్సార్ సరోవర్ అనే పవిత్ర కొలను పక్క నిర్మించారు. అమ్రిత్సర్ చెరువులలో చిన్నదైన రామ్సార్ సరోవర్ ను అయిదవ సిక్కు గురువు గురు అర్జన్ దేవ్ జి నిర్మించారు. ఆయన దీనిని తన తండ్రి గురు రామ్ దాస్ జి పేరుపై నిర్మించారు. ఇక్కడే సిక్కుల పవిత్ర గ్రంధం వుండేది. తర్వాతి కాలం లో దానిని హర్మందిర్ సాహిబ్ కు మార్చారు. పద్మము వంటి డోమ్ కల , చక్కని మార్బుల్ తో నిర్మించిన ఈ గురుద్వారా టూరిస్ట్ లు తప్పక చూడదగినది.