ఇండియన్ మిలటరీ అకాడమీ భారత సైన్యం యొక్క అధికారులకు శిక్షణ ఇచ్చే కేంద్రంగా చెప్పవచ్చు. ఇది 1932 వ సంవత్సరం అక్టోబర్ 1 న 40 జెంటిల్మాన్ క్యాడిట్స్ తో ప్రారంభమైనది. బ్రిగేడియర్ LP కాలిన్స్ అకాడమీలో మొదటి కమాండర్ గా ఉన్నారు.
డిసెంబర్ 1934 లో మొదటి బ్యాచ్ 'పయనీర్స్' అకాడమీ నుంచి బయటకు వచ్చారు. పూర్వ విద్యార్థులు గర్వంగా భారతదేశం,పాకిస్తాన్ మరియు బర్మా సైన్యం లో ఫీల్డ్ మార్షల్ శాం మనెక్షవ్,జనరల్ ముహమ్మద్ ముసా మరియు లెఫ్టినెంట్ జనరల్ స్మిత్ డన్ శిఖరాగ్ర స్థానాలకు చేరుకున్నారు. అకాడమీకి జనవరి 1950 లో నేషనల్ డిఫెన్స్ అకాడమీ (NDA)అనే పేరు పెట్టారు. తరువాత ఖడక్వాస్లాలోని NDA కు కార్యకలాపాలు బదిలీ కాబడ్డాయి. పూనే అకాడమీ మళ్ళీ మిలిటరీ కాలేజ్ గా పేరు మార్చబడింది.
1960 లో దీనిని IMA దాని అసలు పేరుగా తిరిగి మార్చబడింది. అకాడమీ ప్రాంగణంలో ఒక షూటింగ్ ప్రదర్శన గది,ఒక మ్యూజియం,18 హోల్స్ గోల్ఫ్ కోర్సు మరియు ఒక యుద్ధ స్మారక చిహ్నం ఉన్నాయి. వాయువ్య దిశలో ఒక హెలిపాడ్ కూడా ఉన్నది.



Click it and Unblock the Notifications