గ్యుటో మఠం, ధర్మశాల నుండి 6 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక ప్రసిద్ధ పర్యాటక గమ్యస్థానం. ఈ మఠం టిబెట్ బౌద్ధ మత ప్రధాన పాఠశాల, కర్మ కగ్యు పెద్ద కర్మపకు చెందినది. టిసివి పాఠశాలగా కూడా పిలిచే ఈ పాఠశాలలో గౌతమ బుద్దునిగా పేరొందిన శాక్యముని బుద్ధ విగ్రహం ఒక చిన్న గదిలో పొందుపరిచి ఉంది.
ఈ మఠం టిబెట్ స్వంతంత్రం కోసం పోరాడుతూ ప్రాణాలర్పించిన టిబెట్ సైనికుల జ్ఞాపకార్ధ౦ నిర్మించారు. 3వ శతాబ్దంలో అశోకచక్రవర్తి నిర్మించినటువంటి స్తూపాలను పోలిన ఒక నిర్మాణం కూడా ఇక్కడ ఉంది. గ్యుటో మఠం, ప్రధాన పట్టణం నుండి బస్సులు, టాక్సీల ద్వారా చక్కగా కలపబడింది.



Click it and Unblock the Notifications