కాంగ్రాలో కోత్వాలి బజార్ నుండి 3 కిలోమీటర్ల దూరంలో వున్న కునాల్ పత్రి అనే రాతి దేవాలయం ఒక ప్రముఖ పర్యాటక కేంద్రం. జానపదాల ప్రకారం, ఈ దేవాలయంలో ఒక పవిత్ర తడి రాయి ఉంది. ఈ రాయి ఆరడం మొదలైనప్పుడు ఈ ప్రాంతంలో వర్షాలు కురుస్తాయని విశ్వసిస్తారు. సతీదేవి ప్రముఖ అవతారాలలో ఒకటైన కపాలేశ్వరిగా కూడా పిలిచే దుర్గామాతకు చెందిన ఈ ఆలయాన్ని ప్రతి రోజు అనేక మంది భక్తులు సందర్శిస్తారు. ఇక్కడ దగ్గరలోని మరొక దుర్గామాత ఆలయం కూడా అనేక మంది పర్యాటకులను ఆకర్షిస్తుంది.



Click it and Unblock the Notifications