ధర్మశాలకు ప్రధాన రవాణా సదుపాయాలు వాయు, రైలు, రోడ్డు మార్గాలు బాగా అనుసంధాని౦చబడి ఉన్నాయి. వాయుమార్గం: ధర్మశాల నుండి 15 కిలోమీటర్ల దూరంలో ఉన్న గగ్గల్ సమీప విమానాశ్రయం. దేశంలోని ప్రధాన నగరాలకు అనుసంధానించబడి ఉన్న ఈ వైమానిక స్థావరాన్ని ధర్మశాల విమానాశ్రయం అనికూడా అంటారు. న్యూ డిల్లీ లోని ఇందిరా గాంధీ విమానాశ్రయం (ఐజిఐ) అంతర్జాతీయ పర్యాటకులను ధర్మసాలకు కలుపుతుంది. ఈ విమానాశ్రయం నుండి ధర్మశాల వెళ్ళడానికి ఒక్క ట్రిప్పుకు ధర షుమారు 350 రూపాయల ఖర్చుతో టాక్సీలు అందుబాటులో ఉంటాయి.