గంజాం లోని బెర్హంపూర్ నుంచి ఉజ్జలేశ్వర్ 45 కిలోమీటర్ల దూరంలో వుంది. ఒక కొండ మీద సహజ సిద్ధంగా ఏర్పడిన గుహాలయం ఉజ్జలేశ్వర్. ఈ కొండ మీద రాళ్ళను తొలిచి గుడిని చేరుకోవడానికి వీలుగా చాలా మెట్లు నిర్మించారు. దేవాలయం వెనుక భాగం లో దేవతకు నీడనిచ్చే పెద్ద రాయి వుంది. ఈ రాతిని కూడా తొలిచి మెట్ల దారిగా తయారు చేసారు – దీనివల్ల భక్తులు గుడి చుట్టూ చూడడానికి వీలవుతు౦ది.
ఈ ప్రశాంత వాతావరణం ఈ ప్రదేశాన్ని సందర్శించే వారికి పునరుత్సాహాన్ని, ఓదార్పును కలిగిస్తాయి. ఇక్కడికి చేరే ముందు ఘోడహాడ ఆనకట్ట దాటి రావాలి. ఘోడహాడ ఆనకట్ట విజయనగర అనే పేరున్న కోటను, అక్కడి దేవాలయాన్ని ముంచేసింది. ఈ ప్రాంతంలోని ప్రశాంతతను తరచుగా దాహం తీర్చుకోవడానికి బయటకు వచ్చే ఏనుగుల మందలు, కొండచిలువలు, మొసళ్ళు భంగపరుస్తాయి. ఆనకట్ట మీద నిలబడి ఈ జంతువులను చూసి వన్యప్రాణుల అద్భుత దృశ్యాన్ని ఆస్వాదించవచ్చు.



Click it and Unblock the Notifications