ఖమ్మంలోని ప్రసిద్ధ పర్యాటక ఆకర్షణ పాపి కొండలు, ఆంధ్రప్రదేశ్ పర్వత శ్రేణుల్లో వుంది. దక్షిణాది లోని ఈ లోయ అత్యద్భుతమైన అందాన్ని కాశ్మీర్ ప్రకృతి సౌందర్యంతో సమానమైనదని పలువురు విశ్వసిస్తారు. పాపి కొండల పర్వత శ్రేణులు మెదక్, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలలో భాగంగా ఉండి, ఖమ్మం నగరానికి 124 కిలోమీటర్ల దూరంలో ఉన్నాయి.
తెలుగులో ‘విభజన’ అనే పదం నుంచి ఈ పర్వత శ్రేణులు ప్రారంభంలో పాపిడి కొండలు అని పిలువబడ్డాయి. ఈ విభజన వల్ల గోదావరి నదిని రూపొందించి ఈ పర్వతశ్రేణికి ఈ పేరు పెట్టారు. ఈ ప్రాంతాన్ని విహంగ వీక్షణం చేస్తే ఒక స్త్రీ తన జుట్టులో తీసే పాపిట ను పోలి వుండడం వల్ల ఈ శ్రేణులకు ఆ పేరు వచ్చిందని కొంతమంది నమ్మకం.
పాపి కొండల పర్వత శ్రేణులు మునివాటం అనే అందమైన జలపాతాలకు చాలా ప్రసిద్దమైనవి. ఇది తప్పనిసరిగా ప్రశాంతమైన, నిర్మలమైన వాతావరణం కలిగిన గిరిజన ప్రాంతం. చాలామంది ప్రకృతితో మమేకం అవడానికి ఈ జలపాతాలు సందర్శిస్తారు. ఈ ప్రాంతంలోని గిరిజన వర్గాల ప్రజలు పర్యాటకులకు ఎటువంటి హాని కలగచేయకుండా, శాంతియుతంగా ఉంటారు.