విమాన మార్గం: మంత్రాలయం లో విమానాశ్రయం లేదు. అతి సమీపంలో ఉన్న విమానాశ్రయం హైదరాబాద్ లోని శంషాబాద్ లో ఉన్న రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం. హైదరాబాద్ విమానాశ్రయానికి భారత దేశంలోని మరియు ప్రపంచంలోని ఇతర నగరాల నుంచి విమానాలు ఉన్నాయి. విమానాశ్రయం నుంచి మంత్రాలయానికి మీరు టాక్సీ తీసుకుంటే సుమారు 4000 రూపాయలు ఖర్చు అవుతుంది.