మార్గోవా పట్టణంలోని హోలీ స్పిరిట్ చర్చ్ మొదటగా 1564 సంవత్సరంలో నిర్మాణం చేశారు. అయితే 1571 సంవత్సరంలో ఈ చర్చి ముస్లిం సైనికుల యుద్ధానికి గురై విధ్వంసం చేయబడింది. 1645 సంవత్సరంలో తగిన ఆర్ధిక వనరుల ఏర్పాటుతో మరోమారు ఈ చర్చి నిర్మాణం జరిగింది.
ప్రతి సంవత్సరం మే నెల వచ్చిందంటే చాలు హోలీ స్పిరిట్ చర్చి ఫీస్ట్ వేడుకలు, మాస్ ప్రార్ధనలు నిర్వహిస్తుంది. ఈ వేడుకలు మార్గోవా అంతా ఖ్యాతి గాంచాయి. వర్షాకాలం మొదలైందంటే, గోవాలోని ప్రజలు చాలావరకు ఈ ఫీస్ట్ కు హాజరై అక్కడ అందించబడే, ఎండు చేపలు, కూరలు, ఇతర ఆహార పదార్ధాలు ఆరగిస్తారు. సాధారణంగా ఈ వేడుకలు అయిదు నుండి ఆరో రోజులపాటు జరుగుతాయి. బోరోక్ శిల్పశైలి తో నిర్మించబడిన ఈ చర్చి పొడవైన గోపురాలు కలిగి ఉంటుంది. పరిశుభ్రమైన తెల్లని ప్రాంగణం, లోపలి భాగాలు క్రిస్టల్స్ తో అలంకరించబడి ఉంటాయి. చర్చిలో బాగా అలంకరించబడిన ఎత్తైన పీఠాలు, అతిపెద్ద మధ్య భాగ గోపురం కూడా కలవు. ఈ చర్చిసుమారుగా 3000 క్రిస్టియన్ కుటుంబాలచే ప్రార్ధించబడుతూంటుంది.
యాత్రికులు, పర్యాటకులు ఈ చర్చిని వారంలోని ఏడు రోజులపాటు దర్శించుకోవచ్చు. ఈ ప్రదేశానికి చేరటం కూడా తేలికే. క్యాబ్లు, బస్సులు పనాజిం, వాస్కోడా గామాలనుండి మార్గోవా కు అందుబాటులో ఉంటాయి. నార్త్ గోవా లోని ప్రాంతాలు అంటే కండోలిం, బాగా మరియు కాలన్ గూటే, మాపూసా ప్రాంతాల యాత్రికులు లేదా పర్యాటకులకు ప్రయాణం కొంత దూరం అయినప్పటికి ఇది చూడదగిన ప్రదేశం. చర్చి సందర్శన అనంతరం, పర్యాటకులు ఒకప్పటి చిన్నా గోవా గ్రామం నుండి ఒక పెద్ద పట్టణం వరకు అభివృధ్ధి చెందిన మార్ముగోవా పట్టణం చూసి ఆనందించవచ్చు.