కావేరి నది ఒడ్డున కల ఆంజనేయ దేవాలయాన్ని ముత్తతి వచ్చే పర్యాటకులు తప్పక సందర్శించాలి. ఈ దేవాలయంలో హనుమంతుడు ప్రధాన దైవం. ధైర్య సాహసాల కొరకై హిందువులు ఆంజనేయుడిని పూజిస్తారు. శ్రీరాముడి భార్య సీతా దేవి తన వేలి ఉంగరానన్ని ఒకసారి కావేరి నదిలో ఈ ప్రదేశంలో పోగొట్టుకుందని, అపుడు శ్రీరాముడికి బంటు అయిన హనుమంతుడు, కావేరి నదిలో ఆ ప్రాంతాన్ని పూర్తిగా అన్వేషించి ఆ వేలి ఉంగరాన్ని బయటకు తీశాడని కూడా స్ధానికులు చెపుతారు.



Click it and Unblock the Notifications