నెర్సా గ్రామ సమీపాన మహదాయి వ్యాలీ ఒక వినోద పర్యాటక స్ధలం. ప్రపంచంలోనే అత్యధిక జీవ వైవిధ్యం కల ప్రదేశం. కనుక, ఇక్కడకు చేరిన పర్యాటకులు వివిధ రకాల జంతువులను, పక్షులను చూడవచ్చు. కనుమరుగైపోతున్న అనేక జాతులను మహదై వ్యాలీలో చూడవచ్చు.
నెర్సా సందర్శకులు కనేరి నది ఒడ్డునగల సింధేరి రాక్ ను కూడా సందర్శించవచ్చు. సింధేరి రాక్ అంటే, అది ఒక 300 అడుగుల సహజ ఏకశిల.ఇక్కడే సందర్శకులు, చక్కటి పావురాలను, తేనెటీగలను కూడా చూడవచ్చు.
నెర్సా వెళ్ళే వారు తలేవాడి గ్రామాన్ని కూడా చూడవచ్చు. ఇక్కడి అటవీ ప్రాంతంలో రక రకాల గబ్బిలాలుంటాయి. సుమారుగా 40 రకాల జాతులు లోండా అటవీ ప్రాంత పరిధిలోని తలేవాడి గ్రామంలో ఉన్నాయి. ఈ ప్రాంతం దగ్గరలోనే బారాపేడి గుహ ఉంటుంది. దీనిలో 200 గబ్బిలాలు ఉంటాయి.
నెర్సా గ్రామం పర్యాటకులు భీమ్ ఘడ్ కూడా చూడవచ్చు. ఇది సహజ రాళ్ళతో కట్టిన కోట కలిగి ఉంటుంది. దట్టమైన అడవుల మధ్య ఉంది. చారిత్రక వాస్తవాల మేరకు భీమ్ ఘడ్ మరాఠా రాజు శివాజి ఉపయోగించాడని చెపుతారు. ప్రజల కధనం మేరకు పాండవులు, భీముడు ఈ ప్రదేశంలో సంచరించారని, భీముడి పేరుతో...
నెర్సా సందర్శకులు సమీపంలోని క్రిష్ణపూర్ గ్రామాన్ని కూడా సందర్శించాలి. ఇక్కడ షుమారు 20,000 గబ్బిలాలు నివాసం ఉంటాయి. ధియోబాల్డ్ టాంబ్ గబ్బిలాలను కూడా సమీప గుహలలో చూడవచ్చు.