శబరిమల వెళ్లే అయ్యప్ప భక్తులకు రైల్వేశాఖ ఓ శుభవార్తను అందించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నంద్యాల మీదుగా పలు ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. అయ్యప్ప స్వామి దర్శనం కోసం తెలుగు రాష్ట్రాల నుంచి కూడా భారీ సంఖ్యలో భక్తులు తరలి వెళ్తుంటారు. అయితే, చాలామంది శబరిమల వెళ్లేందుకు సరైన రవాణా సౌకర్యాలు లేక ప్రైవేట్ వాహనాలపై ఆధారపడుతున్నారు. ఫలితంగా ప్రమాదాలను కొని తెచ్చుకుంటున్నారు. ఈ క్రమంలో భక్తుల నుంచి శబరిమలకు సరైన రవాణా సౌకర్యం కల్పించాలనే డిమాండ్ ఉంది. ఈ డిమాండ్పై తాజాగా రైల్వే శాఖ కీలకమైన ప్రకటనను జారీ చేసింది.
4 స్పెషల్ ట్రైన్స్..
నంద్యాల జిల్లాలో దీక్ష చేస్తున్న అయ్యప్ప భక్తులందరికీ రైల్వే శాఖ ఓ గుడ్న్యూస్ తీసుకొచ్చిందని, ఎంపీ డాక్టర్ బైరెడ్డి శబరి తెలిపారు. నంద్యాల నుంచి శబరిమల వెళ్లే అయ్యప్ప దీక్షా భక్తుల సౌకర్యార్థం, నంద్యాల మీదుగా నాలుగు ప్రత్యేక రైళ్లను నడపాలని, కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ను ఆమె కోరినట్లు ఎంపీ పేర్కొన్నారు. వారి డిమాండ్ మేరకు స్పెషల్ ట్రైన్స్ను ఏర్పాటు చేసినట్లు ఆమె వివరించారు.
ఇక, ఈ స్పెషల్ ట్రైన్స్ నవంబర్ మొదటి వారం నుంచి నంద్యాల మీదుగా శబరిమలకు భక్తులకు అందుబాటులో ఉంటాయన్నారు. ఈ ట్రైన్స్తో పాటు భారత్ గౌరవ్ పేరుతో శబరిమలకు రైల్వే శాఖ మరో స్పెషల్ ట్రైన్ను నడుపుతోంది. ఇందులో మొత్తం 4 రాత్రులు, 5 పగళ్ల ప్యాకేజీతో ఈ ట్రైన్ ప్రయాణికులకు అందుబాటులోకి రానుంది. ఈ ప్రత్యేక రైలు నవంబర్ 16వ తేదిన సికింద్రాబాద్లో బయలుదేరుతోంది. ఈ ట్రైన్ పిడుగురాళ్ల, గుంటూరు, తెనాలి, ఒంగోలు, గూడూరు మీదుగా శబరిమల అయ్యప్ప చోట్టనిక్కర దేవి ఆలయానికి చేరుకుంటుందని అధికారులు తెలిపారు. తిరిగి ఈ ట్రైన్ వచ్చే నెల 20వ తేదీన తిరుగు ప్రయాణం అవుతుంది.

స్పెషల్ ట్రైన్స్ పూర్తి వివరాలు..
ఈ ట్రైన్లో టీ, టిఫిన్, భోజనం, ఏపీ, నాన్ ఏసీ, ప్రయాణికులకు బీమా అన్నీ వర్తిస్తాయి. ఇక, వీటి టికెట్ ధరల విషయానికొస్తే.. ఒక్కొక్కరికి స్లీపర్ క్లాసులో రూ.11,475 చెల్లించాల్సి ఉంటుంది. అదే థర్డ్ ఏసీలో అయితే, రూ.18,790 చెల్లించాలి. సెకెండ్ ఏసీలో రూ.24,215 చెల్లించాల్సి ఉంటుంది. శబరిమల దర్శనానికి వెళ్లే అయ్యప్ప భక్తులు ఈ సర్వీసును వినియోగించుకోవాలని అధికారులు సూచించారు. శబరిమలకు వెళ్లే ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకుని, మరిన్ని ప్రత్యేక రైళ్లు నడిపే అవకాశం ఉన్నట్లు రైల్వే అధికారులు చెబుతున్నారు. గతంలోనూ శబరిమలకు పలు స్పెషల్ ట్రైన్స్ను అందుబాటులోకి తెచ్చారు. ముఖ్యంగా మకర జ్యోతి దర్శనం సమయంలో శబరిమలను దర్శించుకునేందుకు ఎక్కువ మంది వెళ్తుంటారు. వారి కోసం నవంబర్ నెల చివరి వారం నుంచి డిసెంబర్, జనవరి నెలలో పలు ప్రత్యేక ట్రైన్స్ను నడిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
మూడుసార్లు మాత్రమే..
మకరజ్యోతి సమయంలో శబరిమలలో రద్దీ చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే జ్యోతి దర్శనానికి వచ్చే భక్తులు తమ దర్శనాన్ని సరిగ్గా ప్రణాళిక చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే శబరిమల మకరజ్యోతి ఘట్టం కేవలం 2నుంచి 3 నిమిషాల పాటు మాత్రమే నిర్వహిస్తారు. ఆ సమయంలో కొండపై ఎక్కువ రద్దీ ఉంటుంది. శబరిమల మకరజ్యోతి దర్శనం రోజున ఆలయ నిర్వాహకులు కేవలం మూడుసార్లు మాత్రమే దీపాలు వెలిగిస్తారు. ఆ సమయంలోనే మకరజ్యోతి దర్శనం చేసుకోవాల్సి ఉంటుంది. అందుకే దర్శనం కోసం సరిగ్గా ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది.



Click it and Unblock the Notifications













