Search
  • Follow NativePlanet
Share
» »ప‌ర్యాట‌కుల‌కు గుడ్‌న్యూస్‌.. సోమశిల - శ్రీశైలం, సాగర్ - శ్రీశైలం మ‌ధ్య క్రూయిజ్ జ‌ర్నీ..

ప‌ర్యాట‌కుల‌కు గుడ్‌న్యూస్‌.. సోమశిల - శ్రీశైలం, సాగర్ - శ్రీశైలం మ‌ధ్య క్రూయిజ్ జ‌ర్నీ..

పర్యాటకులకు తెలంగాణ టూరిజం శాఖ ఓ శుభ‌వార్త‌ను అందించింది. క్రూయిజ్ టూర్ ప్యాకేజీలకు సంబంధించి ఓ కీల‌క‌మైన స‌మ‌చారాన్ని అందించింది. ఇందులో భాగంగా టూరిస్టుల కోసం ఒకేసారి రెండు ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకొచ్చింది. సోమశిల టు శ్రీశైలం, సాగర్ టు శ్రీశైలం మధ్య రెండు టూర్ ప్యాకేజీల‌ను ఆపరేట్ చేయనుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలను ఓసారి చూసేద్దాం..

వన్ వేతో పాటు రౌండ్ ట్రిప్ టూర్‌..

వారాంతంలో హైదరాబాద్ నగరానికి స‌మీపంలో ఉండే టూరిస్టు ప్రాంతాల‌కు వెళ్లాల‌నుకునేవారి కోసం తెలంగాణ టూరిజం ఒక‌టి కాదు.. ఏకంగా రెండు ప్యాకేజీల‌ను ప్ర‌క‌టించింది. ప‌ట్ట‌ణానికి ద‌గ్గ‌ర‌గా ఉండే టూరిస్టు స్పాట్‌లలో ఒక‌టి సోమ‌శిల‌. ఇది తెలంగాణ మినీ మాల్దీవులుగా పేరుగాంచింది. ఇది నగరానికి సుమారు 200 కిలోమీట‌ర్ల‌లోపే ఉంటుంది. ఇక‌, ఈ ప్రాంతానికి వెళ్లేందుకు పర్యాటకులు క్యూ కడుతుంటారు. ఇలాంటి వారికోసమే తెలంగాణ టూరిజం స్పెషల్ క్రూజ్ ఆఫర్ టూర్ ప్యాకేజీలను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో సోమశిల టు శ్రీశైలం, సాగర్ టు శ్రీశైలం మధ్య క్రూయిజ్ ప్ర‌యాణం ఉంటుంది. ఈ ప్యాకేజీలో భాగంగా వన్ వేతో పాటు రౌండ్ ట్రిప్ టూర్‌ను కూడా ప‌ర్యాట‌కుల కోసం అందుబాటులోకి తీసుకొచ్చారు.

cruisejourneybetweensomasila

అతి త‌క్కువ ధ‌ర‌కే...

సోమ‌శిల టు శ్రీ‌శైలం టు సోమ‌శిలకు ప్ర‌యాణం ఈ నెల (అక్టోబర్) 26న ప్రారంభం కానుంది. దీంతోపాటు నాగార్జున సాగర్ - శ్రీశైలం - నాగార్జున సాగర్ మధ్య కూడా మరో క్రూయిజ్ టూర్ ప్యాకేజీని తెలంగాణ టూరిజం ప‌ర్యాట‌కుల కోసం తీసుకొచ్చింది. ఈ ప్యాకేజీ నవంబర్ 2న పర్యాటకులకు అందుబాటులో ఉంటుంది. ఇక వీటి ధ‌ర‌ల‌ను ఓసారి ప‌రిశీలిస్తే.. వన్ వే క్రూయిజ్ టూర్ ప్యాకేజీ ధరల్లో పెద్దలకు రూ. 2 వేలు చెల్లించాల్సింది. అదే పిల్లలకయితే రూ. 1600గా నిర్ణ‌యించారు. రౌండ్ క్రూయిజ్ టూర్ ప్యాకేజీ ధరల్లో పెద్దలకు రూ. 3 వేలు చెల్లించాల్సింది. అదే పిల్లలకు రూ. 2,400గా నిర్ణయించారు. ఈ ప్యాకేజీని బుక్ చేసుకోవాలంటే తెలంగాణ టూరిజం అధికారిక వెబ్‌సైట్‌ను https://tourism.telangana.gov.in/ స‌ంప్ర‌దించాల్సి ఉంటుంది.

cruisejourneybetweensomasila1

ఉత్త‌మ గ్రామీణ ప‌ర్యాట‌క ప్రాంతం అవార్డు..

తెలంగాణ మినీ మాల్దీవులుగా పిలవబడే సోమశిల టూరిస్టు ప్రాంతం హైదరాబాద్ న‌గ‌రానికి స‌మీపంలో ఉన్న నాగర్ కర్నూల్ జిల్లాలో ఉంటుంది. ఇది నగరానికి సుమారు 180 కిలోమీట‌ర్ల దూరంలో ఉంటుంది. చుట్టూ నదీ జలాలు, పచ్చని అడవులతో ఈ ప్రాంతం ఎంతో ఆహ్ల‌ద‌భ‌రితంగా ఉంటుంది. ఈ ప్రదేశం పర్యాటకులకు అద్భుతమైన ఆహ్లాదాన్ని పంచుతోంది అన‌డం ఎలాంటి సందేహం లేదు. సోమశిలకు ఇటీవల జాతీయ ఉత్తమ గ్రామీణ పర్యాటక ప్రాంతం అవార్డు కూడా వచ్చింది. కృష్ణా నదీ తీర ప్రాంతంలో ఉండే ఈ ప్ర‌దేశం మాల్దీవుల మాదిరిగా ఒక ద్వీపంలా ఉంటుంది. అందుకే, ప‌ర్యాట‌కులు ఇక్క‌డికి రావ‌డానికి ఎక్కువ‌గా ఆస‌క్తి క‌న‌బ‌రుస్తుంటారు. ఇక‌, ఇక్క‌డ ప‌ర్యాట‌కులు బ‌స చేసేందుకు తెలంగాణ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కాటేజీలను కూడా నిర్మించింది. ఇక్కడ్నుంచి శ్రీశైలం, నాగార్జున‌సాగర్ వంటి ప్ర‌దేశాల‌ను సుల‌భంగా చేరుకోవచ్చు.

More News

Read more about: telangana cruise somasila
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+