రాయ్ గఢ్ ఫోర్ట్ కోట అంటే మహారాష్ట్రలోని రాయ్ గఢ్ జిల్లా అని భావించకండి . రాయ్ గఢ్ కోటను మొగలాయిలతో అనేక యుద్ధాలు చేసిన శివాజీ నిరమాణం చేశాడు. ఈ కోటను మూడువేపులా ప్రవేశం లేని కొండలతోను నాలుగవ వైపు పూర్తి భధ్రతా కావలితోను ఉండేలా నిర్మాణం చేశారు. కోట ప్రవేశించాలంటే, ఒకే కాలిమార్గం. శత్రువులు లోపలికి చొర లేరు. మరాఠా ల రాజధాని రాయ్ ఘర్ నాడు ఎలా ఉందో నేటికి ఈ కోట అదే రకంగా కొనసాగుతోంది.
రాయ్ గఢ్ ముంబై నగరానికి 174 కి.మీ.లు. ఈ కోట 1030 సంవత్సరానికి చెందినది. దీనిని మోరేలు నిర్మించినట్లు తెలుస్తోంది. నేటికి దీనిలో రాణి వాసాలు, కలుపబడిన రెస్ట్ రూములు వంటివి ఆధునికంగా కనపడతాయి. వాచ్ టవర్లు కూడా ఇంకా అందంగానే కలవు. ఖైదీలను శిక్షించే గదులు కూడా కలవు. ఈ కోటకు ప్రారంభంలో 1500 మెట్లు కలవు. అయితే నేడు పర్యాటకులు 2700 అడుగుల ఎత్తుకల ఈ కోటను చేరేందుకు రోప్ వే ఉపయోగిస్తున్నారు. శివాజి విగ్రహం ఒకటి ఉంటుంది. ఒక దేవాలయం, మరియు శివాజి సింహాసనపు గది కూడా కలవు.
ఈ కోట నీటి అవసరాలు గంగా సాగర్ సరస్సు తీరుస్తుంది. పర్యాటకులు ఈ సుందర ప్రదేశ ఛాయా చిత్రాలు తీసి ఆనందించవచ్చు. మహారాష్ట్రలో మరాఠా పాలనా కాలం నాటి అనేక కోటలు, ప్రదేశాలు కలవు. కాని రాయ్ గఢ్ ఉన్నంత సుందరంగా నేటికి ఏ ఇతర కట్టడమూ లేదు.