రాంచిలో బిర్సా ముండా దేశీయ విమానాశ్రయం ఉన్నది. రాంచికి పాట్నా,ఢిల్లీ,ముంబై మరియు కోలకతా నుండి విమానాలు ఉన్నాయి. విమానాశ్రయం నగరంలో నుండి 7 కిలోమీటర్ల దూరంలో ఉంది. ప్రయాణికుల కొరకు కస్టమ్స్ & ఇమ్మిగ్రేషన్,డ్యూటీ ఫ్రీ షాపులు,విశ్రాంతి సౌకర్యాలు,అతిపెద్ద ఇంటిగ్రేటెడ్ టెర్మినల్ మొదలైన వాటిని మార్చి 24, 2013 న ప్రారంభించారు. ఎయిర్ ఇండియా,గొఐర్ మరియు జెట్ ఎయిర్వేస్ వంటి కొన్ని ప్రధాన విమానయాన సంస్థలు భారతదేశం అంతటా గమ్యస్థానాలకు కూడా ఇక్కడి నుంచి ప్రతిరోజు పనిచేస్తాయి.