కియరి దేవాలయం, రుఖల పట్టణానికి కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక ప్రముఖ పర్యాటక ఆకర్షణ. స్త్రీ శక్తి స్వరూపిణి దుర్గామాతకు చెందిన ఈ దేవాలయం 300 ఏళ్ళ నాటిది, దీన్ని ఆశ్రమ నిర్మాణ శైలిలో నిర్మించారు. దుర్గామాత విగ్రహంతో బాటుగా లాంగర వీర్ శిల్పం కూడా ఈ దేవాలయంలో ఉంది....
దేవరి దేవాలయం, హిమాచల్ ప్రదేశ్ లో రుఖలకు 12 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఒక ప్రధాన పర్యాటక గమ్యస్థానం. ఈ దేవాలయం కియోరి దేవాలయం నుండి 2 కిలోమీటర్ల దూరంలో ఉంది. సాహస క్రీడలలో ఆసక్తి ఉన్న పర్యాటకులు, ఈ దేవాలయాన్ని పర్వతారోహణ ద్వారా చేరవచ్చు.
ఆపిల్, రేగు పళ్ళ తోటలు రుఖలలో ప్రధాన పర్యాటక ఆకర్షణలు. ఆపిల్ తోటలు రాయల్, గోల్డెన్, గ్రాన్నీ స్మిత్ ఆపిల్ వంటి రకాల ఉత్పత్తికి, ఎగుమతికి ప్రసిద్ది చెందాయి. ఈ ఆపిల్స్ వాటి సువాసన, రంగు, రుచికి ప్రపంచవ్యాప్తంగా పేరొందాయి. ఈ పండ్ల తోటలు కోతకు సిద్ధంగా ఉండే డిసెంబర్,...