పర్వతారోహణకు అనువైన ప్రదేశం కావటం వలన పర్యాటకులలో బాగా ప్రసిద్ధి చెందింది. ప్రయాణ సమయంలో యాత్రికులు, జమ్మూ కాశ్మీర్ పర్యాటక అభివృద్ధి సంస్థ (జమ్మూ కాశ్మీర్ టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్- జె.కె.టి.డి.సి) నుండి పర్వతారోహణ కరపత్రం తీసుకోవాలి. సానాసార్ పర్యాటకులు పద్ధతిగా నిర్వహించబడుతున్న పర్వతారోహణ మార్గాలను ఎంచుకోవచ్చు. పర్యాటకులు ఎంపిక చేసుకున్న మార్గా లను బట్టి, పర్వతారోహణకు 3 గంటల నుంచి 7 గంటల సమయం పట్టవచ్చు.
ఒకవేళ యాత్రికులు అలిసిపోయినట్టు భావిస్తే, సహాయకుడు వద్ద అందుబాటులో ఉన్న చిన్న గుర్రాలను అద్దెకు తీసుకోవచ్చు. అవసరమైన పర్వతారోహణ పరికరాలు పర్యాటక శాఖ వారి దుకాణాలు అందిస్తాయి. ఈ దుకాణాలలో పూచీ డబ్బు కట్టి పర్యాటకులు స్థానిక లేక దిగుమతి చేయబడిన పర్వతారోహణ పరికరాలు అద్దెకు తీసుకోవచ్చు. భారతదేశం వెలుపల నుండి వచ్చిన యాత్రికులు, పర్వతారోహణ పరికరాలు కోసం పూచీగా వారి పాస్ పోర్ట్ జమ చేయాలి.



Click it and Unblock the Notifications