౧౯౩౬ నుంచి ౧౯౪౮ వరకు గాంధీజీ నివసించిన సేవాగ్రాం ఆశ్రమం వల్ల, సేవాగ్రాం ప్రఖ్యాతి పొందింది.౧౯౩౦ లో దండికి పాదయాత్ర మొదలు పెట్టె ముందు గాంధీజీ భారత దేశానికి స్వాతంత్ర్యం వచ్చే దాక తిరిగి సబర్మతీ ఆశ్రమానికి రానని శపథం చేసారని అంటారు. అప్పటికి భారత దేశానికి స్వాతంత్ర్యం రాకపోగా ఆయన్ను జైల్లో పెట్టారు.విడుదలయ్యాక గాంధీజీ సేవాగ్రాం లో ఉండాలని నిర్ణయించారు. అలా ఈ ఆశ్రమం ఏర్పడింది.ఆశ్రమంలో చాలా విభాగాలున్నాయి. ఆది నివాస్, ప్రార్ధన మైదానం, బా కుటీ, బాపు కుటీ, ఆఖ్రి నివాస మొదలైనవన్నీ గాంధీజీ, ఆయన భార్య కస్తూర్బా వాడిన గదుల్లో కొన్ని. అలాగే బాపు వంటిల్లు, ఆద్య ఆది నివాస్, పర్చురే కుటీ, మహాదేవ కుటీ, కిశోర్ నివాస్, రుస్తం భవన, యాత్రి నివాస్ లాంటి ఇతర గదులూ వున్నాయి.పర్యాటకుల కోసం భారత ప్రభుత్వం ౧౯౮౨ లో యాత్రి నివాస్ భవనాన్ని ప్రత్యేకంగా నిర్మించింది.



Click it and Unblock the Notifications