ఉత్తమ సమయంఅక్టోబర్ నుండి మార్చ్ వరకు ఈ ప్రాంతాన్ని సందర్శించేందుకు అనువైన సమయం. ఉష్ణోగ్రతలు తారా స్థాయిలో ఉండటం వల్ల ఎండకాలం లో ఈ ప్రాంత పర్యటన సౌకర్యంగా ఉండదు. కానీ, ఎండాకాలం లో టైగర్ సఫారీ చేసి తీరాలి. జలపాతాలను సందర్శించే ఆలోచన ఉంటే వర్షాకాలం లో ఈ ప్రాంత పర్యటన ఉత్తమం.
ఎండాకాలంమధ్యప్రదేశ్ లో ఉన్న శివపురి అత్యంత పొడిగా ఉండే ప్రాంతం. ఎండాకాలం లో వాతావరణం వెచ్చగా ఉంటుంది. దట్టమైన అరణ్యాలు, అనేకమైన జలపాతాలు, బర్డ్ సాంచురీలు ఇంకా సరస్సులు ఎండాకాలం వేడి నుండి ఉపశమనం కలిగిస్తాయి. జూన్ లో అత్యధిక స్థాయిలో ఉష్ణోగ్రతలు అంటే దాదాపు 42 డిగ్రీ ల సెల్సియస్ వరకు నమోదవుతుంది.
వర్షాకాలంజూలై నుండి అక్టోబర్ వరకు వర్షాకాలం నమోదవుతుంది. ఈ ప్రాంతం లో ఉన్న అనేకమైన జలపాతాలను సందర్శించడానికి అలాగే సరస్సులను సందర్శించడానికి వర్షాకాలం ఉత్తమమైనది. ఉష్ణోగ్రతలు 20 డిగ్రీల సెల్సియస్ కంటే ఎక్కువగా ఉన్నప్పటికీ చిరుజల్లుల వల్ల వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. అయినప్పటికీ మాధవ్ నేషనల్ పార్క్ ని సందర్శించడానికి వర్షాకాలం అనువైనది కాదు.
శీతాకాలంమధ్యప్రదేశ్ లో ని శీతాకాలం అత్యంత శీతలంగా ఉంటుంది. ఉష్ణోగ్రత 28 డిగ్రీల సెల్సియస్ నుండి 15 డిగ్రీల సెల్సియస్ మధ్యలో నమోదవుతుంది. వాతావరణం చల్లగా ఉండటం వల్ల ఈ ప్రాంత సందర్శనకు అనువుగా ఉంటుంది. ఈ కాలం లో ని జలపాతాల లో ని నీళ్ళు అడుగంటిపోవడం వల్ల జలపాతాలని సందర్శించేందుకు ఈ సమయం అనువైనది కాదు.