తిరుమంగలకుడి, తమిళనాడు లోని తంజావూర్ జిల్లాలో ఉంది. ఈ గ్రామం హిందూ ఆలయమైన ప్రాణనాదేశ్వర్ ఆలయానికి ప్రసిద్ధిచెందింది, ప్రాణనాదేశ్వర్ (శివుడు), మంగలంబిగై (పార్వతి) ఇక్కడి ప్రధాన దేవతలు. ఏ ఆలయం సురియనార్ కోయిల్ నుండి ఒక కిలోమీటరు దూరంలో ఉంది. కింగ్ కులోతుంగా మంత్రి, అలివనార్ రాజు అనుమతి లేకుండా రాజ్యంలో సేకరించిన పన్ను నుండి ఆలయం నిర్మించారని పురాణాల కధనం. ఆరాజు తర్వాత మంత్రి తలను కోయమని ఆదేశించారు. మంత్రిని ఆఖరి కోరిక చెప్పమని అడిగినపుడు, తనను తిరుమంగలకుడి లో కాల్చి బూడిద చేయమని చెప్పాడు.
అందువలన, ఆయన శవాన్ని తిరుమంగలకుడి తీసుకువెళ్ళారు. మంత్రి భార్య తనభర్త జీవితాన్ని తిరిగి తీసుకురమ్మని మంగలంబిగై ఆలయ దేవతను శరణు కోరింది. దేవుని దయవల్ల, మంత్రి బతికాడు. అపుడు అతను ఈ ఆలయానికి వెళ్లి దేవుడిని కౌగలించుకుని ప్రాణనాదేశ్వరా అని పిలిచాడు. అందువలన, ఈ ఆలయ౦లో స్త్రీలు వారి భర్తల శ్రేయస్సును, దీర్ఘకాల జీవితం కోసం మంగలంబిగై దేవతను ఆరాధిస్తారు.



Click it and Unblock the Notifications