భారత్లో పర్యాటకులకు సందర్శించేందుకు గొప్ప పర్యాటక ప్రదేశాలు చాలానే ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా మధ్యప్రదేశ్ రాష్ట్రం ఒకటి. ఇక్కడ అతిపురాతనమైన కోటలు, చారిత్రక కట్టడాలు, ఆధ్యాత్మికత ప్రదేశాలు ఇలా ఒక్కటేమీటీ మరెన్నో ఉన్నాయి. అయితే, మధ్యప్రదేశ్లోని ప్రసిద్ధిచెందిన ప్రదేశాలను చూడాలనుకునేవారి కోసం ఐఆర్సిటిసి ఓ సరికొత్త టూర్ ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ తీసుకొచ్చిన ఈ ప్యాకేజీ వివరాలేంటో చూసేద్దాం...
ఐఆర్సీటీసీ మ్యాజికల్ మధ్యప్రదేశ్ పేరుతో ఈ ప్యాకేజీనీ తీసుకొచ్చింది. ఈ ప్యాకేజీ మొత్తం 5 రాత్రులు, 6 పగళ్లు ఉంటుంది. హైదరాబాద్ నుంచి ఈ ప్రయాణం మొదలవుతుంది. రైలు మార్గంలో ప్రయాణం చేయాల్సి ఉంటుంది. ఈ ప్యాకేజీలో భాగంగా భోపాల్, జబల్పూర్, పచ్మార్హి వంటి ప్రదేశాలను సందర్శించే అవకాశం ఉంటుంది.

టూర్ షెడ్యూల్ ఇదే..
ఈ టూర్ షెడ్యూల్లో భాగంగా మొదటి రోజు సాయంత్రం 4:40 గంటలకు కాచీగూడ రైల్వే స్టేషన్ నుంచి సంపర్క్ క్రాంతి ట్రైన్ బయలుదేరుతుంది. రాత్రంతా జర్నీ చేయాల్సి ఉంటుంది. ఆ మరుసటి రోజు ఉదయం 8 గంటలకు భోపాల్ చేరుకుంటారు. అక్కడి నుంచి హోటల్కు తీసుకెళ్తారు. అక్కడ చెకిన్ అయ్యాక సాంచికి ప్రయాణం ఉంటుంది. అక్కడ సాంచి స్థూపాన్ని సందర్శిస్తారు. అనంతరం అక్కడి నుండి భోజేశ్వర్ మహాదేవ్ టెంపుల్ దర్శనానికి వెళ్తారు. అక్కడి నుండి తిరిగి భోపాల్ చేరుకుంటారు.
అదే రోజు సాయంత్రం ట్రైబల్ మ్యూజియం సందర్శన ఉంటుంది. ఇక, ఆరోజంతా భోపాల్లోనే స్టే చేయాల్సి ఉంటుంది. మూడో రోజు హోటల్లో బ్రేక్ఫాస్ట్ ముగిసాక పచ్మార్హికి బయలుదేరుతారు. అక్కడ హోటల్లో చెకిన్ అయ్యాక ఫ్రీ టైమ్లో అక్కడి ప్రాంతాలు చూసే అవకాశం ఉంటుంది. ఆ తర్వాత ఆ నైటంతా హోటల్లో బస చేయాల్సి ఉంటుంది. నాలుగో రోజు బ్రేక్ఫాస్ట్ ముగిసాక పాంచ్ పాండవ్ కేవ్స్, జట శంకర్ టెంపుల్ దర్శనం చేసుకుంటారు. వీటితోపాటు బీ ఫాల్స్, సన్సెట్ పాయింట్ వంటి ప్రదేశాలను కూడా చూస్తారు. అనంతరం తిరిగి హోటల్కు చేరుకుంటారు. ఆ రాత్రికి అక్కడే స్టే చేస్తారు. ఇక,
ఐదో రోజు ఉదయం అల్పాహారం ముగించుకుని జబల్పూర్ బయలుదేరుతారు.

అక్కడ హోటల్లో చెకిన్ అయిన అయ్యాక, మధ్యాహ్నం మార్బుల్ రాక్స్, ధుంధర్ జలపాతం వంటి ప్రదేశాలు విజిట్ చేస్తారు. అనంతరం జబల్పూర్ రైల్వే స్టేషన్లో డ్రాప్ చేస్తారు. అక్కడి నుంచి తెల్లవారు జామున 2 గంటలకు సికింద్రాబాద్కు తిరుగు ప్రయాణం మొదలవుతుంది.
ఇక, ఆరో రోజు రాత్రి 10 గంటలకు సికింద్రాబాద్కు చేరుకోవడంతో ఈ ప్యాకేజీ ముగుస్తోంది.
ప్యాకేజీ ధరలివే..
ఐఆర్సిటిసి ప్యాకేజీలో భాగంగా వీటి ధరలు ఇలా ఉన్నాయి..కంఫర్ట్(3AC)లో ట్విన్ షేరింగ్కు రూ.23,940 చెల్లించాల్సి ఉంటుంది. అదే ట్రిపుల్ షేరింగ్కయితే రూ.18,290గా నిర్ణయించారు. ఐదు నుంచి 11 సంవత్సరాల చిన్నారులకయితే విత్ బెడ్ అయితే రూ.13,430చెల్లించాల్సి ఉంటుంది. విత్ అవుట్ బెడ్ అయితే రూ.11,810గా నిర్ణయించారు.

ప్రస్తుతం ఈ ప్యాకేజీ అక్టోబర్ 4, 18, నవంబర్ 1, 15, 29వ తేదీల్లో ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. ఈ ప్యాకేజీలో భాగంగా ట్రైన్ టికెట్లు, ప్యాకేజీని బట్టి ట్రాన్స్పోర్ట్ కోసం వెహికల్, బ్రేక్ఫాస్ట్తో కలిపి 3 రోజులు అకామిడేషన్, ట్రావెల్ ఇన్సూరెన్స్వంటివన్నీ కవర్ అవుతాయి.
ఇక, ఈ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు, ఇతర పూర్తి సమచారం కోసం ప్రయాణికులు ఐఆర్సిటిసి అధికారిక వెబ్సైట్ను సంప్రదించగలరు.



Click it and Unblock the Notifications













