కటక్లోని ఐదు అద్భుతమైన పర్యాటక ఆకర్షణలు
భారతదేశంలోని ఒడిశా రాష్ట్ర పూర్వపు రాజధాని కటక్. దీనినే సిల్వర్ సిటీ ఆఫ్ ఇండియా అని కూడా పిలుస్తారు. కటక్ అంటే అక్షరాలా కోట అని అర్ధం. అంతేకాదు, బారాబతి యొక్క పురాతన కోటను సూచిస్తుంది కూడా. దీని చుట్టూ కటక్ పట్టణం విస్తరించి ఉంటుంది. కటక్ని సందర్శించడానికి ఉత్తమ సమయం చలికాలం (అక్టోబర్ నుండి జనవరి వరకు).
దీపావళి మరియు దసరా పండుగల సమయంలో నగరం సందర్శకులతో కిటకిటలాడుతుంది. అంతేకాదు, సరికొత్త పారిశ్రామిక కేంద్రంగా కూడా అభివృద్ధి చెందుతోంది. కటక్ నగరంలో సందర్శించదగ్గ ఉత్తమ స్థలాల గురించి తెలుసుకుందాం .

బరాబతి కోట
బారాబతి కోట 10 వ శతాబ్దానికి చెందిన సోమవంశీ వంశ పాలకుడు మహారాజా మర్కట కేశరిచే నిర్మించబడింది. కోట యొక్క శిథిలాలు ఇప్పటికీ మహానది ఒడ్డున, నగరం యొక్క పశ్చిమ భాగంలో కందకం, ద్వారం మరియు తొమ్మిది అంతస్తుల ప్యాలెస్ యొక్క మట్టి దిబ్బతో గత రోజుల జ్ఞాపకాలను రేకెత్తిస్తాయి. దాని చుట్టూ అన్ని వైపులా లేటరైట్ మరియు ఇసుకరాళ్ళ గోడ ఉంది . ఈ కోటలో నేడు JN ఇండోర్ స్టేడియం, సత్యబ్రత స్టేడియం, స్పోర్ట్స్ హాస్టల్, దర్గా, గదా చండీ మందిర్, కటక్ క్లబ్, హైకోర్టు మ్యూజియం మరియు అనేక ఉన్నత బంగ్లాలు ఉన్నాయి.

కటక్ చండీ ఆలయం
కటక చండీ ఆలయాన్ని కటక్ ఆలయం అని కూడా పిలుస్తారు. ఇది హిందూ దేవత చండికకు అంకితం చేయబడింది. మహానది ఒడ్డున ఉన్న ఈ దేవాలయం గజపతి వంశ నిర్మాణ శైలికి అద్భుతమైన ఉదాహరణ. దుర్గాపూజ, కాళీపూజ మరియు దసరా పండుగల సమయంలో ఆలయాన్ని సందర్శించడానికి సుదూర ప్రాంతాలనుంచి సందర్శకులు ఎక్కువ సంఖ్యలో వస్తుంటారు. ఈ ఆలయం ఉత్కళ బ్రాహ్మణుల పూజారులచే నిర్వహించబడుతుంది. ఎప్పటికప్పుడు నవీకరించబడుతోన్న ఈ పురాతన ఆలయం నిత్యం సందర్శకులతో రద్దీగా దర్శనమిస్తుంది.

భిటార్కనికా వన్యప్రాణుల అభయారణ్యం
కటక్ సమీపంలోని అత్యంత ప్రసిద్ధ ఆకర్షణలలో ఒకటి భిటార్కనికా వన్యప్రాణుల అభయారణ్యం. మొత్తం 672 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ అభయారణ్యం అంతరించిపోతున్న ఎన్నో అరుదైన జీవజాతులకు ఆవాసంగా నిలుస్తోంది. ముఖ్యంగా భారీ ఉప్పునీటి మొసలి, తెల్ల మొసలి, ఇండియన్ పైథాన్, వాటర్ మానిటర్ లిజార్డ్స్, బ్లాక్ ఐబిస్, ది స్పెక్లాల్డ్ కోబ్రా, ఆలివ్ రిడ్లీ తాబేళ్లు మరియు చితాల్ మొదలైన వాటికి నిలయంగా ప్రసిద్ధిగాంచింది. అంతేకాదు, ఈ అభయారణ్యం వలస పక్షుల విడిది కేంద్రంగా కూడా నిలుస్తోంది. శీతాకాలంలో సందర్శించడానికి ఇది అనువైన పర్యాటక ప్రాంతం.

ఖదమ్ ఇ రసూల్ మసీదు
18వ శతాబ్దంలో స్థాపించబడిన కదమ్ రసూల్ మసీదులో మహమ్మద్ ప్రవక్త పాదముద్ర ఉంది. 57 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉన్న ఈ నిర్మాణం ఒడిశాలోని మొఘల్ వాస్తుశిల్పానికి ఓ ముఖ్యమైన నమూనాగా చెప్పుకొవచ్చు. దీని ప్రాంగణంలో అనేక దర్గాలు, మసీదులు, శాసనాలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఉన్న ముస్లింలకు ఈ మసీదు అత్యంత పవిత్రమైన ప్రదేశం మరియు ప్రతి సంవత్సరం అనేక మంది పర్యాటకులు ఈ మసీదును సందర్శిస్తారు. ఈ మసీదు ఇండో-పర్షియన్ నిర్మాణ శైలికి అద్భుతమైన ఉదాహరణ. దీనిని హిందూ రాజు నిర్మించినట్లు చెబుతారు.

నేతాజీ జన్మస్థలం మ్యూజియం
గొప్ప స్వాతంత్య్ర సమరయోధుడు నేతాజీ సుభాష్ చంద్రబోస్ జన్మస్థలం కటక్గా చెబుతారు. బోస్ పూర్వీకుల ఇల్లు 2007లో పూర్తిగా పునరుద్ధరణ చేసిన తర్వాత ఇప్పుడు మ్యూజియంగా మారింది. ఒకప్పుడు బోస్ కుటుంబానికి నివాసంగా ఉన్న ఈ భవనం పూర్తిగా గ్యాలరీలతో ఇప్పుడు బోస్ ఉపయోగించిన పురాతన వస్తువులు మరియు ఫర్నిచర్తో నిండి ఉంటుంది. అంతేకాదు, అనేక అరుదైన ఫోటోలు ఇక్కడ పొందుపరచబడ్డాయి.



Click it and Unblock the Notifications













