ఢిల్లీ, చండీగఢ్ల నుంచి ఈ వీకెండ్లో షిమ్లా, మనాలీ, ధర్మశాల వైపు ట్రిప్ ప్లాన్ చేసుకుంటున్నారా? అయితే ఈ వాతావరణ అలెర్ట్ను ఖచ్చితంగా గమనించాలి. హిమాచల్ ప్రదేశ్లోని బిలాస్పూర్, చంబాతో పాటు కాంగ్రా, మండి జిల్లాలకు ఆగస్టు 21న వాతావరణ శాఖ 'ఎల్లో అలెర్ట్' జారీ చేసింది. అలాగే ఆగస్టు 27 వరకు వర్షాలు కురిసే అవకాశముందని తెలిపింది. శుక్రవారం ఉదయానికి రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 128 రోడ్లను మూసివేశారు. వీటిలో మండి, కుల్లు కారిడార్లు ఎక్కువగా ప్రభావితమయ్యాయి. వర్షాలు పడుతుండటంతో రోడ్లు మూసుకుపోవడం, మళ్లీ క్లియర్ చేయడం రోజంతా కొనసాగేలా ఉంది.
NH-3 కీరత్పూర్-మండి-కుల్లు-మనాలీ జాతీయ రహదారిపై పందోహ్-ఔట్, బనాలా, దేఓద్ ప్రాంతాలు కొండచరియలు విరిగిపడే ప్రమాదంలో ఉన్నాయి. ఈ వారంలో కొండరాళ్లు జారిపడటంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగి, డైవర్షన్లు విధించాల్సి వచ్చింది. ఆగస్టు ప్రారంభంలో మనాలీ నుంచి కీలాంగ్ వైపు అటల్ టన్నెల్ అందుబాటులోనే ఉన్నప్పటికీ, అక్కడికి వెళ్లే రోడ్ల పరిస్థితిని బట్టే ప్రయాణం ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రయాణానికి అదనపు సమయాన్ని కేటాయించుకోండి. నదీ లోయల గుండా వెళ్లే ఇరుకైన మార్గాల్లో ట్రాఫిక్ నిలిచిపోతే వేచి ఉండక తప్పదు.

హిమాచల్లో ఎల్లో అలెర్ట్.. ఆగస్టు 27 వరకు వర్షాలు
బిలాస్పూర్, చంబా, కాంగ్రా, మండి జిల్లాలకు ఐఎమ్డీ ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఆగస్టు 27 వరకు వర్షాలు కొనసాగే సూచనలు ఉన్నాయి. ఎండగా అనిపించినప్పటికీ కొండచరియలు సడన్గా విరిగిపడటం, వాగులు ఉధృతంగా పారడం జరగొచ్చు. అందుకే ఉదయమే ప్రయాణం ప్రారంభించి, పగటి వెలుతురులోనే కొండ మార్గాలను దాటడం సురక్షితం. మీ ప్రయాణ ప్రణాళికలో మార్పులకు సిద్ధంగా ఉండండి. బయలుదేరే ముందు జిల్లా హెచ్చరికలు, నావ్కాస్ట్లు చెక్ చేసుకోండి.
NH-3 కీరత్పూర్-మనాలీ రూట్, అటల్ టన్నెల్ ప్రయాణ వివరాలు
NH-3 పై పందోహ్ డ్యామ్, సిక్స్-మైల్ బనాలా, రోడ్డు మరమ్మతులు జరుగుతున్న ఇరుకైన ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆగిపోయే అవకాశం ఉంది. బియాస్ నది ఒడ్డుకు దూరంగా ఉండండి; ఈ నెల ప్రారంభంలో నీటి విడుదల ఎక్కువగా ఉండటంతో నేలకోత ప్రమాదం పెరిగింది. మార్గం మధ్యలో కొత్తగా కొండచరియలు విరిగిపడితే, రిస్క్ తీసుకోకుండా మండి లేదా కుల్లు ప్రాంతాల్లోనే ఆగడం మంచిది. కొండ లోయల ప్రాంతంలోకి ప్రవేశించే ముందు స్థానిక పోలీసుల అప్డేట్స్ తెలుసుకోండి.
| రూట్ | బయలుదేరాల్సిన సమయం | ప్రస్తుత ప్రయాణ సమయం | రోడ్డు మూతపడితే ప్రత్యామ్నాయం |
|---|---|---|---|
| ఢిల్లీ - షిమ్లా (NH‑44/NH‑5) | ఉదయం 4–5 గంటలకు | 8–11 గంటలు | ధరంపూర్ వద్ద ట్రాఫిక్ ఉంటే నాలాఘర్-ఆర్కి మీదుగా.. |
| ఢిల్లీ - మనాలీ (NH‑3) | తెల్లవారుజామున 3–4 గంటలకు | 12–16 గంటలు | మండి/కుల్లు వద్ద ఆగడం; లేదా ఊనా మీదుగా ధర్మశాల వెళ్లడం |
| చండీగఢ్ - ధర్మశాల | ఉదయం 5–6 గంటలకు | 6–8 గంటలు | మండి రూట్ మూతపడితే ఊనా-కాంగ్రా మార్గం బెటర్ |
షిమ్లా, ధర్మశాల మార్గాలు.. లైవ్ అప్డేట్స్ ఎలా తెలుసుకోవాలి?
షిమ్లాలోని ధల్లీ-సంజౌలీ బైపాస్ జూన్లో దెబ్బతినగా, భట్టకూఫర్-మెహ్లీ మార్గంలో ఈ వారం మధ్యలో మట్టి దిబ్బలు విరిగిపడ్డాయి. కుఫ్రీ, నార్కండా వైపు వెళ్లే మార్గాలు కొండచరియలు విరిగిపడే ప్రమాదంలో ఉన్నాయి. వాహనాలను కొండ చరియల కింద కాకుండా, గట్టిగా ఉండే సురక్షితమైన ప్రదేశాల్లో పార్క్ చేయండి. కాంగ్రాలో మేఘావృతం (క్లౌడ్బర్స్ట్) లేదా భారీ వర్షాలు కురిస్తే ధర్మశాల పర్యటన ప్లాన్ను తదనుగుణంగా మార్చుకోండి.
ఐఎమ్డీ వెబ్సైట్లో లైవ్ వాతావరణ హెచ్చరికలను గమనిస్తుండండి. రోడ్ల సమాచారం కోసం HPSDMA, జిల్లా హెల్ప్లైన్ నంబర్లు 1070 (రాష్ట్ర ఎమర్జెన్సీ ఆపరేషన్స్ సెంటర్), 1077 (జిల్లా కంట్రోల్ రూమ్) లలో సంప్రదించవచ్చు. అటల్ టన్నెల్ వైపు వెళ్లే మార్గాల పరిస్థితిని లాహౌల్-స్పితి రోడ్ పేజీలో చెక్ చేసుకోవచ్చు. రోడ్లపై మట్టి తొలగింపు పనుల వల్ల కల్కా-షిమ్లా ట్రెయిన్ సర్వీసులు రద్దయ్యే అవకాశం ఉంది. కాబట్టి ట్రైన్ టికెట్లు, హోటల్ బుకింగ్లను రీఫండబుల్ ఆప్షన్తో బుక్ చేసుకోవడం మంచిది.



Click it and Unblock the Notifications











