జమ్మూ-శ్రీనగర్ మధ్య ఉధంపూర్ మీదుగా మరో వందే భారత్ ఎక్స్ప్రెస్ను నడిపేందుకు భారతీయ రైల్వే పచ్చజెండా ఊపింది. ఈ మార్గంలో అందుబాటులోకి రానున్న మూడో వందే భారత్ రైలు ఇది. కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ ఆగస్టు 20, 2026న 'ఎక్స్' (ట్విట్టర్) వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. ఈ కొత్త సర్వీస్ కోసం 26407, 26408 రైలు నంబర్లను ప్రతిపాదించారు. రైలు ప్రారంభ తేదీ, నడిచే రోజుల వివరాలపై రైల్వే బోర్డు త్వరలోనే అధికారిక సర్క్యులర్ విడుదల చేయనుంది. పర్యాటకులు, యాత్రికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఈ అదనపు రైలును తీసుకొస్తున్నారు.
272 కిలోమీటర్ల ఉధంపూర్-శ్రీనగర్-బారాముల్లా రైల్ లింక్ (USBRL) పూర్తిస్థాయిలో అందుబాటులోకి రావడంతో ఈ రూట్లో రైలు ప్రయాణం మరింత వేగవంతమైంది. ప్రయాణికుల రద్దీకి అనుగుణంగా ఏప్రిల్లోనే జమ్మూ తావి-శ్రీనగర్ వందే భారత్ కోచ్ల సంఖ్యను 20కి పెంచారు. మే 2, 2026 నుంచి క్రమం తప్పకుండా సర్వీసులు కొనసాగుతుండటంతో ఉదయం, మధ్యాహ్నం వేళల్లో ప్రయాణికులకు రవాణా సదుపాయం మెరుగైంది. ప్రస్తుత వేళల ప్రకారం ఈ రైలు ఉదయం 6:20 గంటలకు జమ్మూలో బయలుదేరి, ఉదయం 11:10 గంటలకు శ్రీనగర్ చేరుకుంటుంది. కాశ్మీర్ లోయకు వెళ్లేందుకు తీవ్ర పోటీ నెలకొనడంతో వీకెండ్స్లో టికెట్లు క్షణాల్లో అమ్ముడైపోతున్నాయి.

జమ్మూ-శ్రీనగర్ వందే భారత్ రూట్, స్టాప్లు, వేళల వివరాలు
కొత్తగా రానున్న ఈ వందే భారత్ రైలుకు ఉధంపూర్లో హాట్ కేటాయించారు. దీనివల్ల ఆ జిల్లా ప్రజలకు ప్రయాణం సులభతరం కానుంది. ప్రస్తుతం నడుస్తున్న జమ్మూ-శ్రీనగర్ వందే భారత్ రైళ్లు ఉధంపూర్, కత్రా, బనిహాల్ స్టేషన్లలో ఆగుతున్నాయి. కొత్త రైలు కూడా దాదాపు ఇవే స్టేషన్లలో ఆగే అవకాశం ఉంది. దీనిపై రైల్వే శాఖ త్వరలోనే పూర్తి వివరాలు ప్రకటించనుంది. కత్రాకు వెళ్లే వైష్ణోదేవి భక్తులు రైల్వే కారిడార్ దాటాల్సిన అవసరం లేకుండా అదే స్టేషన్లో సులభంగా వేరే రైలు మారవచ్చు.
ఛార్జీలు, టికెట్ బుకింగ్ వివరాలు
కొత్త రైలు ఛార్జీలపై అధికారిక ప్రకటన వచ్చే వరకు ప్రస్తుతం ఉన్న ధరలనే ప్రామాణికంగా తీసుకోవచ్చు. ఈ రూట్లో ఛైర్ కార్ టికెట్ ధర సుమారు ₹660 నుంచి ₹715 వరకు ఉంది. ఎగ్జిక్యూటివ్ ఛైర్ కార్ ధర ₹1,270 నుంచి ₹1,320 వరకు ఉంది. ఐఆర్సీటీసీ (IRCTC) వెబ్సైట్లో టైమ్టేబుల్ అప్డేట్ కాగానే బుకింగ్స్ ప్రారంభమవుతాయి. ఏసీ తరగతులకు ఉదయం 10 గంటలకు తత్కాల్ బుకింగ్ ఓపెన్ అవుతుంది. కాగా, నవంబర్ 1, 2024 నుంచి అడ్వాన్స్ రిజర్వేషన్ గడువు 60 రోజులుగా ఉన్న సంగతి తెలిసిందే.
వందే భారత్లో ప్రయాణించే వారి కోసం ముఖ్యమైన టిప్స్
USBRL రూట్లో ప్రయాణించేటప్పుడు విండో సీట్ ఎంచుకుంటే మనోహరమైన పర్వతాలు, సొరంగ మార్గాల అందాలను ఆస్వాదించవచ్చు. రైలు మధ్యలో ఉండే కోచ్లలో ప్రయాణం చాలా సుఖవంతంగా ఉంటుంది. ప్రకృతి అందాలు కనిపించే ప్రదేశాల్లో డోర్ల దగ్గర ప్రయాణికులు గుమిగూడే అవకాశం ఉంది. ప్రయాణంలో పెద్ద సూట్కేసుల కంటే చిన్న క్యాబిన్ బ్యాగులు తీసుకెళ్లడమే మంచిది. వర్షాలు పడే సమయంలో భద్రత దృష్ట్యా రైలు వేగం తగ్గించే అవకాశం ఉన్నందున, కాస్త సమయం చేతిలో ఉంచుకుని ప్లాన్ చేసుకోవడం శ్రేయస్కరం. దక్షిణ భారత్ నుంచి వచ్చే ప్రయాణికులు జమ్మూకు త్వరగా చేరుకుంటే, అదే రోజు లోయ ప్రాంతాలకు చేరుకోవచ్చు.



Click it and Unblock the Notifications











