కేరళ తీరంలో సముద్రం తీవ్ర అల్లకల్లోలంగా మారడంతో ఈరోజు (ఆగస్టు 21) అధికారులు అలర్ట్ జారీ చేశారు. తీరం వెంట రాకాసి అలలు ఎగసిపడే అవకాశం ఉందని హెచ్చరించారు. తిరువనంతపురం, కొల్లాం, అలప్పుళా, ఎర్నాకుళం, మలప్పురం, కోజికోడ్, కణ్ణూర్, కాసరగోడ్ జిల్లాల్లో ఈరోజు ఉదయం 11:30 గంటల వరకు ఈ అలెర్ట్ కొనసాగనుంది. ఇక త్రిసూర్ జిల్లాలో మాత్రం ఆగస్టు 22న రాత్రి 11:30 గంటల వరకు ఈ హెచ్చరికలు అమలులో ఉంటాయి. ఈ క్రమంలో ప్రముఖ బీచ్లలో ఎర్రజెండాలు పాతే అవకాశం ఉంది. పర్యాటకులు లైఫ్గార్డ్ల సూచనలు తప్పక పాటించాలని, వెళ్లేముందు స్థానికంగా బీచ్లు తెరిచి ఉన్నాయో లేదో సరిచూసుకోవాలని స్పష్టం చేశారు. తీరంలో 1.0 నుంచి 1.5 మీటర్ల ఎత్తు వరకు అలలు ఎగసిపడే ఛాన్స్ ఉందని అధికారులు తెలిపారు.
ఎగసిపడే పెద్ద అలల వల్ల సముద్ర రక్షణ గోడలు, రాతి కట్టడాలను దాటుకుని నీరు రోడ్లపైకి దూసుకొచ్చే ప్రమాదం ఉంది. అందుకే ఎర్రజెండాలు ఉన్న చోట ఈత కొట్టేందుకు అస్సలు సాహసించవద్దు. ముఖ్యంగా అలల ఉధృతి ఎక్కువగా ఉండే జెట్టీలు, బ్రేక్వాటర్స్ (అలల నిరోధక గోడల) వద్దకు వెళ్లకపోవడమే మంచిది. ఫోర్ట్ కొచ్చి, చెరాయ్, మారారి వంటి తీర ప్రాంతాల్లో అలలకు దూరంగా సురక్షిత ప్రదేశాల నుంచే వీక్షించండి. బయటకు వెళ్లేముందు ఎరుపు-పసుపు రంగు లైఫ్గార్డ్ గుర్తులు ఉన్న సురక్షిత ప్రాంతాలను చూసుకుని వెళ్లడం శ్రేయస్కరం.

కేరళ తీరంలో హై-వేవ్స్ హెచ్చరికలు: జిల్లాలు, సమయాల వివరాలు
| జిల్లా | హెచ్చరిక సమయం (IST) |
|---|---|
| తిరువనంతపురం | ఆగస్టు 21, ఉదయం 11:30 వరకు |
| కొల్లాం | ఆగస్టు 21, ఉదయం 11:30 వరకు |
| అలప్పుళా | ఆగస్టు 21, ఉదయం 11:30 వరకు |
| ఎర్నాకుళం | ఆగస్టు 21, ఉదయం 11:30 వరకు |
| మలప్పురం | ఆగస్టు 21, ఉదయం 11:30 వరకు |
| కోజికోడ్ | ఆగస్టు 21, ఉదయం 11:30 వరకు |
| కణ్ణూర్ | ఆగస్టు 21, ఉదయం 11:30 వరకు |
| కాసరగోడ్ | ఆగస్టు 21, ఉదయం 11:30 వరకు |
| త్రిసూర్ | ఆగస్టు 22, రాత్రి 11:30 వరకు |
సముద్రం అల్లకల్లోలంగా ఉన్న సమయంలో అలప్పుళా, కుమరకోమ్లలో హౌస్బోట్ ప్రయాణాలు ఆలస్యమయ్యే అవకాశం ఉంది. కాబట్టి పర్యాటకులు తమ బోట్ స్లాట్లను ముందే రీ-కన్ఫర్మ్ చేసుకోవాలి. ప్రయాణంలో ఐడెంటిటీ కార్డులు వెంట ఉంచుకోవడం, లైఫ్ జాకెట్లు ధరించడం, ప్యాసింజర్ మేనిఫెస్ట్ వివరాలు సరిచూసుకోవడం తప్పనిసరి. ఆగస్టు 19న కుమరకోమ్ సమీపంలోని వేంబనాడ్ సరస్సులో పర్యాటకుల షికారా బోట్ మునిగిపోగా, వాటర్ ట్రాన్స్పోర్ట్ సిబ్బంది సకాలంలో స్పందించి వారిని సురక్షితంగా కాపాడారు. ఈ ఘటన నేపథ్యంలో ఈరోజు భద్రతా తనిఖీలను మరింత కఠినతరం చేశారు. ఈదురుగాలులు ఎక్కువైతే ఆకస్మిక తనిఖీలు చేపట్టే అవకాశం ఉంది.
హై-వేవ్స్ అలెర్ట్: బీచ్లకు బదులు సందర్శించదగిన సురక్షిత ప్రదేశాలు
శుక్రవారం, ఆగస్టు 22 వరకు సముద్రం ఇలాగే అల్లకల్లోలంగా ఉండే అవకాశం ఉన్నందున, బీచ్లకు వెళ్లే ప్లాన్ను వాయిదా వేసుకుని ఇతర పర్యాటక ప్రాంతాలను సందర్శించడం ఉత్తమం. మున్నార్ తేయాకు తోటల అందాలను చూడటానికి డే-ట్రిప్ ప్లాన్ చేయవచ్చు, వయనాడ్లో తేలికపాటి ఫారెస్ట్ ట్రెక్కింగ్ చేయవచ్చు లేదా కొచ్చి నుంచి అతిరపల్లి జలపాతాలు, ముజిరిస్ వారసత్వ సంపదను సందర్శించవచ్చు. ఒకవేళ మీరు తీర ప్రాంతంలోనే ఉంటే, వాకింగ్ లేదా సూర్యాస్తమయం చూడటానికి మాత్రమే పరిమితం అవ్వడం మంచిది. బయటకు వెళ్లేముందు అధికారుల హెచ్చరికల సమయాన్ని మరోసారి సరిచూసుకోండి.
తీర ప్రాంతాల్లోని లోతట్టు రహదారులపై ప్రయాణించే వారు కొంచెం అదనపు సమయాన్ని కేటాయించుకోవడం మంచిది. ఇటీవల చేర్తల-కుమరకోమ్-కొట్టాయం రహదారి నీట మునిగిన దృష్ట్యా, అలల ఉధృతి లేదా భారీ వర్షాలు పడే సమయంలో ఇరుకైన కాజ్వేలపై ప్రయాణించవద్దు. కొచ్చి వాటర్ఫ్రంట్ పరిసరాల్లో అలలు ఎగసిపడుతున్న సమయంలో సీ-వాల్స్కు దూరంగా వాహనాలను పార్క్ చేయాలి. ప్రధానంగా గుర్తుంచుకోవాల్సిన నియమం ఏమిటంటే.. లైఫ్గార్డ్ల సూచనలు పాటించాలి, పిల్లలను సముద్రపు రాళ్ల దగ్గరకు వెళ్లనివ్వకూడదు, ఇంటి నుంచి బయలుదేరే ముందే బోట్ షెడ్యూళ్లు, బీచ్ వేళలను రీ-కన్ఫర్మ్ చేసుకోవాలి.



Click it and Unblock the Notifications











