Search
  • Follow NativePlanet
Share
» »విశాఖ టూర్ ప్లాన్ చేస్తున్నారా? అక్క‌డి వేస‌వి ఉష్ణోగ్ర‌త‌లు ఎలా ఉన్నాయంటే?!

విశాఖ టూర్ ప్లాన్ చేస్తున్నారా? అక్క‌డి వేస‌వి ఉష్ణోగ్ర‌త‌లు ఎలా ఉన్నాయంటే?!

భారత వాతావరణ శాఖ (IMD) సూచనల‌ ప్రకారం.. ఈ ఏడాది మ‌న‌దేశం కఠినమైన వేసవిని ఎదుర్కోబోతోంది. మార్చి నుండి మే వరకు ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా ఉంటాయని అంచనా వేస్తున్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ మరియు ఉత్తర కర్ణాటకలతో కూడిన ఈశాన్య ద్వీపకల్ప ప్రాంతంలో వేడిగాలులు వీస్తాయ‌ని నిపుణులు భావిస్తున్నారు. ప్ర‌ముఖ‌ ప‌ర్యాట‌క ప్ర‌దేశాల‌లో ఒక‌టిగా నిలిచిన విశాఖ తీరం టూర్ ప్లాన్ చేసేవారికి అక్క‌డి వాతావ‌ర‌ణం అనుకూలంగా ఉండ‌క‌పోవ‌చ్చ‌నే అంచ‌నాలు క‌నిపిస్తున్నాయి.

ఆంధ్రప్రదేశ్‌లోని అనేక ప్రాంతాలలో మార్చి మొదటి రోజుల్లో ఇప్పటికే 40°C ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. మ‌రీ ముఖ్యంగా ఏపీలోనే బెస్ట్ టూరిస్ట్ స్పాట్‌గా పేరొందిన విశాఖ తీరంపై ఈ ప్ర‌భావం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది. మార్చి ప్రారంభం నుంచే వైజాగ్‌ నగరంలో విపరీతమైన వేడి నెలకొంది. ఇప్ప‌టికే అక్కడి ప్ర‌జ‌లు మందపాటి జాకెట్‌ల స్థానంలో కాటన్ వ‌స్త్రాలు దరిస్తున్నారు. నిత్యం సందడిగా క‌నిపించే న‌గ‌ర వీధులు ఖాళీగా ద‌ర్శ‌న‌మిస్తున్నాయి. స్థానిక‌ ప్రజలు ఎయిర్ కండిషనింగ్ సౌకర్యంతో తమ ఇళ్ల‌ను చ‌ల్ల‌బ‌రుచుకుంటున్నారు.

vizagc1

సాధార‌ణం కంటే ఎక్కువ న‌మోదు

వాతావ‌ర‌ణ నిపుణుల మాట‌ల ప్ర‌కారం.. పసిఫిక్ మహాసముద్రంలో కొనసాగుతున్న ఎల్‌నినో ప్ర‌భావంతో ఈ సంవత్సరం వేసవి వైజాగ్‌లో కఠినంగా ఉంటుంద‌ని చెబుతున్నారు. ముఖ్యంగా ఏప్రిల్, మే నెలల్లో వేసవి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉంది. దీని సంఖ్యను మనం ఖచ్చితంగా అంచనా వేయలేనప్పటికీ, ఉష్ణోగ్రత తీవ్ర‌త‌ సాధారణం కంటే ఎక్కువగా ఉంటుంది.

నిజానికి, వేస‌వి సమయంలో వైజాగ్ సగటు ఉష్ణోగ్రత సాధారణంగా 35°C ఉంటుంది. ఇది ఏడాదిలో దాదాపు 40°C వరకు వెళ్లవచ్చని అంచ‌నా వేస్తున్నారు. దీనికితోడు వర్షపాతం తక్కువగా ఉండ‌డంతో గత ఐదు నుండి ఆరు సంవత్సరాలతో పోలిస్తే స్థానికులు వేడి వాతావరణాన్ని మ‌రింత‌గా ఎదుర్కోవాల్సి వ‌స్తుంది. వేసవి మే చివరిలో గరిష్ట స్థాయికి చేరుకుంటుంది. జూన్ మొదటి రెండు వారాలలో క్రమంగా త‌గ్గుముఖం ప‌డుతుంద‌ని చెబుతున్నారు.

visakhatour places to visit

ఈ జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రి!

స‌మ్మ‌ర్ సీజ‌న్‌లో విశాఖ అందాల‌ను ఆస్వాదించాల‌నుకునేవారికి ఇది చేదు వార్త‌గానే అనిపించ‌వ‌చ్చు. అయితే, ఈ తీర‌పు న‌గ‌రంలో సాయంత్రం వేళ విహ‌రించేందుకు సీజ‌న్‌లో ప‌నేముంది చెప్పండి. అదే స‌మ‌యంలో కొన్ని ఆరోగ్య‌ప‌ర‌మైన జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రి అంటున్నారు వైద్యులు. విహార స‌మ‌యంలో తగినంత ద్రవాలు తీసుకోండి. ఎందుకంటే, శ‌రీరంలో ద్రవాలు కోల్పోవడం వ‌ల్ల డీహైడ్రేష‌న్‌కు గుర‌య్యే అవ‌కాశం ఉంది. సీజనల్ పండ్లయిన పుచ్చకాయ, మామిడి వంటి పండ్ల రసాలను తీసుకోవాలి. మధ్య వయస్కులతో పోలిస్తే చిన్న పిల్లలు, పెద్దలు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి.

ఎండ తీవ్ర‌త వీరిపై ఎక్కువ ప్ర‌భావం చూపుతుంది. మ‌రీ ముఖ్యంగా మీరు ధ‌రించే బ‌ట్ట‌ల విష‌యంలో ప‌లు జాగ్ర‌త్త‌లు పాటించాలి. కాట‌న్ వ‌స్త్రాల‌ను వేసుకోవ‌డం వ‌ల్ల ఎండ వేడిమినుంచి చాలా వ‌ర‌కూ ర‌క్ష‌ణ పొంద‌వ‌చ్చు. 2024 వేసవిలో వైజాగ్ విహారాన్ని ఆశించేవారు రాబోయే వాతావరణంపై ఈ నివేదిక దృష్ట్యా, హెచ్చరికలను పాటించాలని, తమను తాము జాగ్రత్తగా చూసుకోవాలని ప్రతి ఒక్కరినీ కోరుతున్నాం!

More News

Read more about: visakha tour andhra pradesh
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+