ఇండోర్లోని ప్రసిద్ధ దేవాలయాలను చూశారా?
ఇండోర్లో చూడటానికి ఒకటి కంటే ఎక్కువ అందమైన ప్రదేశాలు ఉన్నాయి. అయితే, ఇక్కడ ప్రసిద్ధ దేవాలయాలు ఉన్నాయి. అయితే ఇక్కడ ఉన్నఆలయాలు ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందాయి. ప్రతి సంవత్సరం ఈ ఆలయాలకు పెద్ద సంఖ్యలో పర్యాటకులు తరలి వస్తుంటారు. హృదయపూర్వకంగా ఇక్కడ పూజలు చేయడం ద్వారా భక్తుల కోరికలన్నీ నెరవేరుతాయని ఇక్కడికి వచ్చే పర్యాటకులు నమ్ముతారు. అటువంటి పరిస్థితిలో, మీరు ఇండోర్ సందర్శించడానికి వెళ్లాలనుకుంటే మాత్రం ఈ ప్రసిద్ధ దేవాలయాలను సందర్శించడం మర్చిపోవద్దు.

అన్నపూర్ణ దేవాలయం
ఈ ఆలయం ఇండోర్లోని పురాతన దేవాలయాలలో ఒకటి. ఈ ఆలయం హిందూ దేవత అన్నపూర్ణకు అంకితం చేయబడింది. ప్రతి సంవత్సరం ఇక్కడ పర్యాటకుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ ఆలయంలో అన్నపూర్ణాదేవితో పాటు, కాలభైరవుడు, శివుడు మరియు హనుమంతుడు మొదలైన దేవతా విగ్రహాలు కూడా ప్రతిష్టించబడ్డాయి. ఈ ఆలయ గోడల అలంకరణ చూడదగ్గదే. ఇది ఇండోర్లోని ప్రసిద్ధ మతపరమైన ప్రదేశాలలో ఒకటి.

పెద్ద గణపతి ఆలయం
ఈ ఆలయంలో 25 అడుగుల అద్భుతమైన గణేశుడి విగ్రహం ఉంది. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద గణేశ విగ్రహంగా ప్రసిద్ధి చెందింది. ఈ ఆలయాన్ని 1875 సంవత్సరంలో నిర్మించారు. ఇండోర్లోని బడా గణపతి దేవాలయం పర్యాటకులకు ప్రధాన ఆకర్షణ. గణపతి విగ్రహంలోని మరొక ఆసక్తికరమైన అంశం దాని ఆకృతి. దీని తయారీకి ఇటుకలు, సున్నపురాయి, పంచరత్న పొడి, బెల్లం, ప్రముఖ పుణ్యక్షేత్రాల పవిత్ర జలం, ఏడు మోక్షపురి మట్టి మొదలైన అనేక పదార్థాలు ఉపయోగించబడ్డాయి.
గోమతగిరి
గోమతగిరి జైన భక్తులకు పవిత్ర స్థలం. ఇక్కడ 21 అడుగుల గోమటేశ్వర విగ్రహం నిర్మించబడింది. ఇది శ్రావణబేగోలాలోని బాహుబలి విగ్రహం పర్యాటకులను ఆకర్షిస్తుంది. ఇండోర్ వచ్చే పర్యాటకులందరూ ఈ ప్రదేశాన్ని తప్పక సందర్శించాలి.

ఖజ్రానా గణేష్ ఆలయం
ఇండోర్లో ఎక్కువగా సందర్శించే దేవాలయాలలో ఖజ్రానా గణేషుని ఆలయం ఒకటి. ప్రతిఏటా ఇక్కడికి వేలసంఖ్యలో యాత్రికులు తరలివస్తుంటారు. ఈ ఆలయం దేశంలోని ప్రసిద్ధ దేవాలయాలలో ఒకటి. ఇక్కడ ప్రతిష్టించిన గణేశుని విగ్రహాని్న మొఘల్ పాలకుడు ఔరంగజేబు నుండి రక్షించేందుకు బావిలో దాచారాని పురాణాలు చెబుతున్నాయి. 1735లో విగ్రహాన్ని వెలికితీసిన తర్వాత ఈ ఆలయాన్నిరాణి అహల్యభాయి హోల్కర్ నిర్మించారు.

బిజాసేన్ టేక్రీ, ఇండోర్
ఇండోర్లోని ప్రసిద్ధ ప్రార్థనా స్థలాలలో ఒకటైన బిజాసేన్ టేక్రి దుర్గామాత అవతారంగా పరిగణించారు. 1920 లో నిర్మించబడిన ఈ ఆలయం 800 అడుగుల ఎత్తయిన కొండపై ఉంది. ఈ ప్రాంతం చుట్టుతూ పచ్చని తోటలు ఒక అందమైన సరస్సు కూడా ఉంది. ఇక్కడి ఎత్తయిన కొండపై నుండి కిందకి చూస్తే ఇక్కడి అందాలను వీక్షించవచ్చు. నవరాత్రుల సమయంలో ఇక్కడ ఒక జాతరను నిర్వహిస్తారు. ఈ జాతరకు ఎక్కడినుంచో యాత్రికులు, పెద్దసంఖ్యలో తరలివస్తారు. ఈ జాతరతో ఈ ప్రాంతం ఇంకా ప్రసిద్ధి గాంచింది. ఈ ఆలయాన్ని ఇండోర్ మహారాజా శివాజీరావు 1760లో నిర్మించారు. పురాతన కాలంలో ఇక్కడ కృష్ణ జింకల అడవి ఉండేదని ఇక్కడి స్థానికులు చెబుతున్నారు. ఇండోర్లోని ఈ అద్భుతమైన దేవాలయాలతో పాటు, జైన సమాజానికి చెందిన ప్రముఖ ప్రార్థనా స్థలాలైనా అద్భుతమైన కంచమందిర్లను సందర్శించొచ్చు.



Click it and Unblock the Notifications












