Search
  • Follow NativePlanet
Share
» » అద్భుతమైన శిల్పకళల‌కు నిల‌యాలు.. భార‌త్‌లోని ఈ ఆల‌యాలు..

అద్భుతమైన శిల్పకళల‌కు నిల‌యాలు.. భార‌త్‌లోని ఈ ఆల‌యాలు..

భార‌త‌దేశంలో ఆధ్యాత్మిక ప్రాంతాల‌కు కొదవే లేదు. ఇక్క‌డ ప్రతి ఆలయానికి దాని సొంత‌ ఆధ్యాత్మిక, మతపరమైన ప్రాముఖ్యత ఉంటుంది. కానీ మన దేశంలోని వివిధ ప్రాంతాలలో అనేక దేవాలయాలు వాటి మతపరమైన ప్రాముఖ్యత, అద్భుతమైన వాస్తుశిల్పం, చారిత్రాత్మకత కారణంగా సుదూర ప్రాంతాల నుండి పర్యాటకులను ఆకర్షిస్తూనే ఉన్నాయి. ఇటీవల అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామమందిర ప్రారంభోత్సవం వార్త‌లో చర్చనీయాంశమైంది. ఇక్క‌డి ఆలయ చారిత్రక, మతపరమైన ప్రాముఖ్యతతో పాటు, ఈ ఆలయం యొక్క అద్భుతమైన శిల్పకళ కూడా ప‌ర్యాట‌కుల‌లో చర్చనీయాంశంగా మారింది. ఇక్కడికి వచ్చే భక్తులు కేవలం మతపరమైన ప్రాముఖ్యతను మాత్రమే కాకుండా అద్భుతమైన వాస్తుశిల్పంతో కూడా ఆకట్టుకునే కొన్ని ఆలయాల గురించి ఇప్ప‌డు తెలుసుకుందాం.

rammandir

రామమందిరం, ఉత్తరప్రదేశ్

అయోధ్యలోని శ్రీరామ జన్మభూమిపై నిర్మించిన రామాలయం ప్రపంచ వ్యాప్తంగా ఎంతో ఆకర్షణీయంగా మారిందనే చెప్పుకోవాలి. అయితే ఈ ఆలయ నిర్మాణ పనులు ఇంకా పూర్తి కాన‌ప్ప‌టికి, అయోధ్య రామాల‌యం శ్రీ‌రాముని విగ్ర‌హ‌ప్ర‌తిష్టాప‌న కార్య‌క్రమం మాత్రం ఎంతో వైభవంగా పూర్తియింది. ఈ రామాల‌యం నిర్మాణం అద్భుతమైన వాస్తుశిల్పానికి ఉదాహరణ అని స్పష్టమవుతుంది. చంద్రకాంత్ సోంపురా, అతని కుమారులు రూపొందించిన ఈ ఆలయం పూర్తిగా రాళ్లతో నిర్మించబడింది. వివిధ రకాల కళాఖండాలు, దేవుళ్ళు, దేవతల విగ్రహాలు రాళ్లను చెక్కడం ద్వారా ఆలయ గోడలపై చెక్కబడ్డాయి. నాగరా శైలిలో నిర్మించిన రామాలయం ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద హిందూ దేవాలయంగా చెప్పబడుతోంది.

అక్షరధామ్ టెంపుల్, ఢిల్లీ

ఢిల్లీలోని అక్షరధామ్ ఆలయం నిర్మాణం కూడా ఎంతో అద్భుతంగా ఉంటుంది. ఇది ఆధునిక కాలంలో నిర్మించిన దేవాలయమని, ఇది పూర్తిగా ప్రాచీన భారతీయ కళ మరియు వాస్తుశిల్పాల నుండి ప్రేరణ పొందిందని అర్థం చేసుకోవచ్చు. ఈ ఆలయ నిర్మాణ పనులు 2005లో పూర్తయ్యాయి. అప్పటి నుండి, ఈ ఆలయం భారతదేశంలో ఎక్కువ మంది సందర్శించే కొన్ని దేవాలయాలలో ఒకటిగా పేరుగాంచింది. ఈ ఆలయ స్తంభాలు, శిఖరం మరియు విగ్రహాలు హిందూ గ్రంథాల ఆధారంగా చెక్కబడ్డాయి.

maduraimeenakshi

మీనాక్షి అమ్మన్ ఆలయం, తమిళనాడు

దక్షిణ భారత దేవాలయాలు వాటి అద్భుతమైన వాస్తుశిల్పం కారణంగా దేశం నలుమూలల నుండి పర్యాటకులను ఆకర్షిస్తాయి. మదురై మీనాక్షి అమ్మన్ ఆలయం కూడా ఈ జాబితాలో చేరింది. ఈ ఆలయం ద్రావిడ శైలికి అద్భుతమైన ఉదాహరణ అనిచెప్పుకోవ‌చ్చు. ఈ ఆలయ ప్రాంగణం మాత్రమే కాదు, దాని గోపురంలో చెక్కిన కళాఖండాలు ఇక్క‌డికొచ్చే ప‌ర్యాటకుల‌ను ఎంత‌గానో ఆశ్చర్యపరుస్తాయి. ఈ ఆలయంలోని క‌ళాఖండాల‌కు చాలా ప్రకాశవంతమైన రంగులను ఉపయోగించారు.. ఆ రంగులు ఈ కళాఖండాలకు జీవం పోసినట్లుగా అనిపిస్తుంది. ఈ ఆలయ ప్రధాన లక్షణాలలో ఒకటైన సాంప్రదాయ పురాణ విశ్వాసాల ఆధారంగా ఆలయంలోని ప్రతి స్తంభంపై కళాఖండాలు చెక్కబడ్డాయి.

ఖజురహో దేవాలయం, మధ్యప్రదేశ్

ఖజురహో ఆలయ సముదాయం భారతదేశం నుండి మాత్రమే కాకుండా ప్రపంచం నలుమూలల నుండి పర్యాటకులను ఎంత‌గానో ఆకర్షిస్తుంది. ఈ ఆల‌యం యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో కూడా చేర్చబడింది. ఈ ఆలయాన్ని 9వ మరియు 11వ శతాబ్దాల మధ్య చందేలా రాజవంశం నిర్మించింది. ఖజురహో దేవాలయాలు వాటి ఇంద్రియ శిల్పాలకు అత్యంత ప్రసిద్ధి చెందాయి. ఇవి మానవ జీవితాన్ని, ఆధ్యాత్మికతను కలిపే ఆల‌యాలు అని చెప్పుకోవ‌చ్చు. ఇక్క‌డి అతిపెద్ద ఆలయం శివునికి అంకితం చేయబడిన కందారియా మహాదేవ్ ఆలయం.

brihadeeswarartemple

బృహదీశ్వరాలయం, తమిళనాడు

తంజావూరులోని బృహదీశ్వరాలయ నిర్మాణం కూడా ఎంతో పురాత‌న‌మైన‌ది అద్భుత‌మైద‌ని. ఈ ఆల‌యాన్ని బృహదీశ్వర దేవాలయం అని కూడా పిలుస్తారు. ఇది UNESCO ప్రపంచ వారసత్వ జాబితాలో చేర్చబడిన ఒక చారిత్రక దేవాలయం. ఈ ఆలయం చోళుల శిల్పకళకు అద్భుతమైన ఉదాహరణ. ఈ ఆలయాన్ని 11వ శతాబ్దంలో మొదటి రాజ రాజ చోళుడు నిర్మించాడు. ఈ ఆలయంలో శివుని భారీ లింగ రూపాన్ని ప్రతిష్టించారు. ఇది పర్యాటకులను ఎంత‌గానో ఆకట్టుకుంటుంది. ఆధ్యాత్మికతతో పాటు వాస్తుశిల్పం కోసం పర్యాటకులను ఆకర్షిస్తున్న ఆలయాల జాబితాలో ఈ ఆలయం కూడా చేర్చబడింది.

సూర్య దేవాలయం, ఒడిశా

ఒడిశాలోని కోణార్క్ సూర్య దేవాలయం యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో కూడా చేర్చబడింది. ఈ ఆలయం కళింగ వాస్తుశిల్పం ఆధారంగా నిర్మించబడింది. సూర్య భగవానుడికి అంకితం చేయబడిన ఈ దేవాలయం ఆకారం రథాన్ని పోలి ఉంటుంది. అయితే ఇది చెక్కతో చేసిన రథం కాదు. బరువైన రాళ్లను చెక్కి నిర్మించిన భారీ రథం ఆకారంలో ఉన్న ఆలయం. ఈ ఆలయంలో, సూర్యుని ఆధారంగా సమయం, తేదీని గుర్తించే అనేక గడియారాలు ఉన్నాయి. ఇవి రాళ్లను చెక్కడం ద్వారా తయారు చేయబడ్డాయ‌ని ఇక్క‌డివారు చెబుతుంటారు.

elloratemple

కైలాష్ ఆలయం, ఎల్లోరా గుహలు, మహారాష్ట్ర

ఎల్లోరా గుహలలో ఒకే రాయిని చెక్కడం ద్వారా భారీ కైలాస దేవాల‌యాన్ని నిర్మించారు. ఇది పురాతన కాలంలో భారతదేశ వాస్తుశిల్పం ఎంత అభివృద్ధి చెందిందో రుజువు చేస్తుంది. ఈ శివాలయం గోడలపై హిందూ మతం ఆధారంగా వివిధ దేవతలు మరియు దేవతల బొమ్మలు చెక్కబడ్డాయి. జైన, బౌద్ధ మరియు హిందూ కళాఖండాల మిశ్రమంగా ఉన్న ఈ ఆలయం చుట్టూ ఎల్లోరా గుహలు ఉన్నాయి.

More News

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+