భారతదేశం దాని వైవిధ్యం, సంస్కృతి కారణంగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. ఇక్కడి చరిత్ర చాలా గొప్పది. ఇక్కడ ఉన్న అనేక భవనాలు సందర్శించేందుకు అనువైనవి. ఇక్కడ ఉన్న కోట అందమైన చెక్కడం, అద్భుతమైన పనితనానికి ప్రసిద్ధి చెందిన భవనాలలో ఒకటిగా నిలిచింది. ఇక్కడ ప్రతి రాష్ట్రానికి దాని సొంత మాండలికం, దుస్తులు, ఆహారం ఉన్నాయి. ఆర్కిటెక్చర్, హస్తకళకు సంబంధించిన అనేక అందమైన ఉదాహరణలను ఇక్కడ చూడొచ్చు.
దాని అందం కారణంగా, ఇది పర్యాటకానికి మంచి గమ్యస్థానంగా నిలిచింది. భారతదేశం అంతటా మరెన్నోఅందమైన కోటలున్నాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రంలో కూడా కొన్ని అద్భుతమైన కోటలున్నాయి. వాటి చరిత్ర గురించి తప్పక తెలుసుకోవాల్సిందే. ఇటువంటి అనేక చారిత్రక వారసత్వ ప్రదేశాలు చరిత్ర గురించి తెలుసుకోవాలనుకునేవాళ్లు తప్పకుండా ఈ కోటలను సందర్శించాల్సిందే.

మండు కోట
మండు కోట మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని అత్యంత ప్రసిద్ధ, అతిపెద్ద కోటలలో ఒకటిగా నిలిచింది. దీనిని రాజా భోజ్ స్థాపించారు. ఈ కోట నిర్మాణం ఎంతో అద్భుతంగా ఉంటుంది. దీని అందమైన చెక్కడం చాలా కాలంగా ప్రజలను ఆకర్షిస్తూనే ఉంది. సుసంపన్నమైన చరిత్ర, సంస్కృతిని ప్రత్యక్షంగా చూడాలనుకునేవారు తప్పకుండా ఈ కోటలను సందర్శించాల్సిందే.

రైసెన్ కోట
మధ్యప్రదేశ్లోని అందమైన కోటలలో రైసెన్ కోట ఒకటి. ఈ కోట 1200 AD కి ముందు నిర్మించబడింది. ఇది ఒక కొండపై ఉంటుంది. ఇందులో భారీ నీటి నిల్వలు, రాజభవనాలు మరియు దేవాలయాలు కూడా ఉన్నాయి. ఈ కోటలో ఓ దర్గా కూడా ఉంది. అది ఈ కోట ప్రత్యేకతను వివరిస్తుంది. ఆ దర్గా పేరు సెయింట్ హజ్రత్ పీర్ ఫతేహుల్లా షా దర్గా. అంతేకాదు ఈ కోటలో ఓ శివాలయం కూడా ఉంది. ఈ కోట మతసామరస్యాలకు ప్రతీక అని చెప్పుకోవచ్చు.

గ్వాలియర్ కోట
గ్వాలియర్లో ఉన్న ఈ అందమైన కోట భారతీయ కోటల రత్నాలలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఇది చాలా అందమైన, క్లిష్టమైన హస్తకళల కారణంగా పర్యాటకుల హృదయాలను గెలుచుకుంది. దాని అద్భుతమైన పనితనం కారణంగా, ఇది భారతదేశంలోని అత్యంత రంగుల కోటలలో ఒకటిగా కూడా పరిగణించబడుతుంది. ఈ కోట చుట్టూ మాన్ మందిర్, గుజ్రీ మహల్ అనే రెండు అద్భుతమైన ప్యాలెస్లు ఉన్నాయి. ఈ కోట పర్యాటకులను ఎంతగానో ఆకట్టుకుంటుంది.
అసిర్ఘర్ కోట
మధ్యప్రదేశ్లో ఉన్న అసిర్ఘర్ కోట చారిత్రక వారసత్వానికి మరొక అద్భుతమైన ఉదాహరణ అని చెప్పుకోవాలి. దీనిని 'డోర్ ఆఫ్ డెక్కన్' అని కూడా అంటారు. ఇది బుర్హాన్పూర్ నగర శివార్లలో ఉంటుంది. సాత్పురా కొండలపై ఉన్న ఈ కోట ఎత్తు దాని గొప్ప చరిత్రను వివరిస్తుంది.
మహేశ్వర్ కోట
మధ్యప్రదేశ్లోని ఖర్గోన్ జిల్లా సమీపంలో మహేశ్వర్ కోట ఉంది. ఈ కోటను అహల్య కోట అని కూడా అంటారు. ఈ కోట పవిత్ర నర్మదా నది కొండపై ఉంటుంది. ఈ కోట ఎంతో అద్భుతంగా, అందంగా ఉంటుంది. ఈ కోట నిర్మాణం పర్యాటకులను ఎంతగానో ఆకర్షిస్తుంది. ఇక్కడి జలపాతాలు మరియు రంగురంగుల పడవలు ఈ ప్రదేశాన్ని మరింత అందంగా మారుస్తాయి.



Click it and Unblock the Notifications













