Search
  • Follow NativePlanet
Share
» »అద్భుత శిల్పకళాశైలికి నిద‌ర్శ‌నం.. బృందావ‌నంలోని ఈ ఆల‌యాలు..!

అద్భుత శిల్పకళాశైలికి నిద‌ర్శ‌నం.. బృందావ‌నంలోని ఈ ఆల‌యాలు..!

అద్భుత శిల్పకళాశైలికి నిద‌ర్శ‌నం.. బృందావ‌నంలోని ఈ ఆల‌యాలు..!

బృందావనం ఉత్తరప్రదేశ్‌లోని పవిత్ర నగరాలలో ఒకటిగా ప్ర‌సిద్ధి చెందింది. ఈ నగరాన్ని సందర్శించడానికి భారతదేశం నుండే కాకుండా విదేశాల నుండి కూడా భ‌క్తులు త‌ర‌లివస్తుంటారు. బృందావనం శ్రీ కృష్ణుని చిన్ననాటి కాలక్షేపాల ప్రదేశం అని అంటారు. దీని కారణంగా కూడా ఈ ప్రదేశం ప్రజలలో బాగా ప్రాచుర్యం పొందింది. ఈ ప్రాంతంలో చాలా అందమైన రాధా-కృష్ణ దేవాలయాలను చూడొచ్చు. శ్రావ‌ణ మాసంలో బృందావన ఆలయాల అందాలు మ‌రింత రెట్టింప‌వుతాయి. బృందావన్‌లో ప్ర‌సిద్ధి చెందిన ఆల‌యాలు ఎన్నోఉన్నాయి. అవెంటో చూద్దాం ప‌దండి.

1

ఇస్కాన్ ఆలయం

బృందావన్‌లోని ఇస్కాన్ దేవాలయం ప్ర‌జ‌ల్లో బాగా ప్రాచుర్యం పొందింది. ఈ ఆలయాన్ని కృష్ణ బలరాముడి ఆలయం అని కూడా అంటారు. ఈ ఆలయం సరిగ్గా శ్రీకృష్ణుడు తన తోటి పిల్లలతో ఎక్కడైతే ఆడుకున్నాడో అక్కడే ఉంది. ఈ ప్రదేశం ఆధ్యాత్మికత భావంతో నిండి ఉంటుంది. ఇస్కాన్ ఆలయం ప్రతిరోజూ ఉదయం 4.30 గంటలకు తెరిచి మధ్యాహ్నం 1 గంటలకు మూసివేయబడుతుంది. తిరిగి సాయంత్రం 4.30 గంటలకు తెరిచి 8.30 గంటలకు మూసివేయబడుతుంది. ఈ ఆలయంలో భక్తులు భగవద్గీత మరియు ఇతర పురాణాలను చదువుతుంటారు. స్థానికంగా ఈ ఆల‌యాన్నిఆంగ్రేజ్ మందిర్ అని కూడా పిలుస్తారు . దీనిని హరే కృష్ణ ఉద్యమ వ్యవస్థాపకుడు - AC భక్తివేదాంత స్వామి శ్రీల ప్రభుపాద స్థాపించారు.

2

రాధా రామన్ ఆలయం

బృందావనంలోని ఠాకూర్‌కు అంకితం చేయబడిన ఏడు దేవాలయాలలో శ్రీ రాధా రామన్ మందిర్ ఒకటి. శ్రీ గోపాల్ భట్ట కోరిక మేరకు 1542లో ఈ ఆలయాన్ని నిర్మించారు. ఈ ఆలయంలోని విగ్రహం స్వయంగా శిల్పగ్రామ్ శిల నుండి సృష్టించబడిందని నమ్ముతారు. రాధా రామన్ ఆలయం బృందావన్ రైల్వే స్టేషన్ నుండి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ ఆలయం ప్రతిరోజూ ఉదయం 8 నుండి మధ్యాహ్నం 12:30 వరకు సాయంత్రం 6 నుండి 8 గంటల వరకు తెరిచి ఉంటుంది. ఇది బృందావన్ రైల్వే స్టేషన్ నుండి 500 మీటర్ల దూరంలో ఉన్న వారసత్వ దేవాలయం. ఈ ఆలయం అందంగా చెక్కబడి పర్యాటకులను విశేషంగా ఆకర్షిస్తుంది.

3

నిధివన్ ఆలయం

భారతదేశంలోని అత్యంత రహస్యమైన దేవాలయాలలో నిధివన్ ఆలయం ఒకటి. బృందావన్‌లోని దట్టమైన అడవుల మధ్య ఉన్న ఈ ఆలయ సముదాయం ప్రపంచ వ్యాప్తంగా ప్రజలను ఆకర్షిస్తుంది. కృష్ణుడు ఇక్కడ గోపికలతో ఆహారాన్ని తయారు చేస్తాడని, అంతేకాకుండా తన అర్ధాంగి రాధతో, గోపికలతో రాస లీల జరుపుతాడని చెబుతారు. ఈ కారణంగానే ప్రతి రోజు సాయంత్రం 5 గంటల తరువాత నిధివన్ ను మూసి వేస్తార‌ని న‌మ్ముతారు. ఎవరైనా చీకటి పడిన తరువాత లోపల ఉండాలని ప్రయత్నిస్తే వారికి దృష్టి లోపం, వినికిడి సమస్యలు, మూగతనం వస్తాయని చెబుతారు.

శ్రీ రంగ‌నాథ దేవాల‌యం

శ్రీ‌ రంగనాథ దేవాలయం భారతదేశంలోని ఉత్తర ప్రదేశ్‌లోని మధుర సమీపంలోని బృందావన్ పట్టణంలో ఉన్న ప్రసిద్ధ హిందూ దేవాలయం. ఈ ఆలయం విష్ణువు అవతారమైన రంగనాథునికి అంకితం చేయబడింది. ఈ ఆలయం భారతదేశంలోని వైష్ణవులకు అత్యంత ముఖ్యమైన పుణ్యక్షేత్రాలలో ఒకటి. ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి పర్వదినాల సందర్భంగా ఈ ఆలయానికి దేశం నలుమూలల నుండి వేలాది మంది భక్తులు వస్తుంటారు.

More News

Read more about: iskcon temple vrindavan
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+