దేశంలో ప్రసిద్ధిచెందిన ప్రదేశాలు చాలానే ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా దేశ చరిత్రకు అద్దంపట్టే అనేక చారిత్రక కట్టడాలు కూడా ఎక్కువే. ఇక, మధ్యప్రదేశ్ గురించి చెప్పాలంటే ఇక్కడి కోటలు, పురాతన భవనాలు దేశ సంస్కృతిని చాటి చెబుతాయి. రాష్ట్రంలోని రాణి కమలపతి ప్యాలెస్ ప్రసిద్ధ పర్యాటక కేంద్రంగా పేరుగాంచింది. ఈ ప్యాలెస్ భోపాల్లోని కమ్లా పార్క్లో ఉంది. ఇది ఒక రాజ స్మారక చిహ్నం. ఈ ప్యాలెస్ భోపాల్ అద్భుతమైన చరిత్రకు నిదర్శనంగా నిలుస్తోంది. రండి ఈ ప్యాలెస్ విశేషాలు చూసేద్దాం.
ఈ ప్యాలెస్ 19వ శతాబ్దంలో మరాఠా రాజవంశానికి చెందిన శక్తివంతమైన రాణి కమలపతిచే నిర్మించారు. ప్రాంతంలోని మరాఠా వాస్తుశిల్పానికి అత్యుత్తమ ఉదాహరణలలో ఒకటిగా పరిగణించబడుతుంది. రాణి కమలపతి ప్యాలెస్ దాని అద్భుతమైన ముఖభాగానికి ఎంతో పేరుగాంచింది. ఈ ప్యాలెస్ను భారతీయ, యూరోపియన్ నిర్మాణ శైలిలో నిర్మించారు. ఈ ప్యాలెస్లో ఎన్నో బొమ్మలు, అందమైన గాజు కిటికీలు కూడా ఉన్నాయి. ఇక, ఈ ప్యాలెస్ మెర్లోన్లు ఉంటారు. ఇవి నీటి తామరల ఆకారంలో ఉంటాయి. అంతే కాదు ఈ ప్యాలెస్ మరెన్నో అద్భుతమైన రహస్యాలు దాగి ఉన్నట్లు స్థానికులు చెబుతున్నారు.

ప్యాలెస్లో ఎన్నో ప్రత్యేకతలు..
రాణి కమలపతి ప్యాలెస్ ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. ఈ ప్యాలెస్లోని సరస్సులో 1723లో రాణి కమలపతి ఆత్మహాత్య చేసుకుంది. రాణి కమలపతి గోండు తెగకు చెందిన పెద్ద యోధుడైన నవల్ షా భార్య. ఈ ప్యాలెస్లో అత్యంత ఆకర్షిణీయమైన ప్రదేశాలు ఎగువ సరస్సు, దిగువ సరస్సు. అయితే రాణి మరణానంతరం సర్దార్ దోస్త్ ఈ ప్యాలెస్ను తన ఆధీనంలోకి తీసుకున్నట్లు చరిత్ర చెబుతోంది.
ప్రస్తుతం ఈ ప్యాలెస్ భారత పురావస్తు శాఖ అండర్ లో ఉంది. ఈ ప్యాలెస్లోని వెలుపలి భాగం ఎంతో ప్రత్యేకంగా నిలుస్తుంది. ఇది భారతీయ, యూరోపియన్ డిజైన్లతో చేసింది. ఈ ప్యాలెస్ను 18వ శతాబ్దపు ప్రారంభంలో నిర్మించారు. ఈ ప్యాలెస్ను లక్షౌరీ ఇటుకలతో నిర్మించారు. ఈ ప్యాలెస్లో ఎన్నో ప్రత్యేకతలున్నాయి. గ్రౌండ్స్ లోపల పాత ఫిరంగి, పంచక్కి అని పిలిచే వాటర్మిల్ అవశేషాలు దాగి ఉన్నాయి. రాజభవనానికి పశ్చిమాన ఫతేఘర్ కోట శిథిలాలు కూడా ఉన్నాయి.

మ్యూజియం..
ఈ ప్యాలెస్లో ఒక మ్యూజియం కూడా ఉంది. ఈ మ్యూజియంలో మధ్యప్రదేశ్ గత చరిత్రను తెలిపే అనేక రకాల వస్తువులు, పాత మాన్యుస్క్రిప్ట్లు కూడా ఉన్నాయి. సందర్శకులు ఈ ప్రదర్శనలను వీక్షించొచ్చు. మధ్యప్రదేశ్ చరిత్ర తెలుసుకోవాలనుకునేవారు తప్పక ఈ మ్యూజియంను చూడాల్సిందే. ఈ ప్యాలెస్లో ఒక అందమైన తోట కూడా ఉంది. అందులో విహరించవచ్చు. ఇక, ఈ ప్యాలెస్లో మహరాణి కమలపతి విశ్రాంతి తీసుకున్న అనేక గదులను కూడా మీరు చూడొచ్చు. ప్యాలెస్లో ఉండే ఎగువ సరస్సు బోటింగ్, పిక్నిక్లకు ప్రసిద్ధి చెందింది. ఈ సరస్సులో సరదాగా బోటింగ్ కూడా చేయొచ్చు. ఇక, దిగువ సరస్సు పడవ ప్రయాణానికి అనువైనది. ఈ సరస్సు ఎగువ సరస్సుకు ఆనుకొని ఉంటుంది.



Click it and Unblock the Notifications













