Search
  • Follow NativePlanet
Share
» »అరుణాచ‌లం వెళ్లాల‌నుకుంటున్నారా? అయితే ఈ ప్యాకేజీ మీ కోసమే..!?

అరుణాచ‌లం వెళ్లాల‌నుకుంటున్నారా? అయితే ఈ ప్యాకేజీ మీ కోసమే..!?

దేశంలో ప్ర‌సిద్ధిచెందిన పుణ్యక్షేత్రాలు ఎన్నో ఉన్నాయి. అందులో ఒకటి అరుణాచ‌లం. ఇక్క‌డ ప్ర‌తినెల పౌర్ణ‌మీ నాడు గిరి ప్ర‌ద‌క్షిణ చేసేందుకు భక్తులు త‌ర‌లివ‌స్తుంటారు. అయితే, మీరుకూడా అరుణాచ‌లం వెళ్లాల‌ని ప్లాన్ చేస్తుంటే మాత్రం ఈ టూర్ ప్యాకేజీ మీ కోసమే. తెలంగాణ టూరిజం హైద‌రాబాద్ టు అరుణాచ‌లం ఓ స‌రికొత్త టూర్ ప్యాకేజీని తీసుకొచ్చింది. ఈ టూర్ లో భాగంగా అరుణాచ‌లం సంద‌ర్శించొచ్చు. తెలంగాణ టూరిజం అందిస్తోన్న ఈ ప్రత్యేక ప్యాకేజీ మొత్తం నాలుగు రోజుల పాటు సాగుతుంది. హైదరాబాద్ సిటీ నుంచి ఈ ప్యాకేజీని ఆపరేట్ చేస్తారు. ఆ వివ‌రాలేంటో చూసేద్దాం..

దక్షిణభారతంలో అత్యంత పేరు గాంచిన ప్రాంతం అరుణాచల.. ఈ పుణ్యక్షేత్ర సంద‌ర్శ‌న‌కు నిత్యం వేలాది మంది భ‌క్తులు వెళుతుంటారు. ఏపీ, తెలంగాణ నుంచి వెళ్లే భక్తుల‌ సంఖ్య కూడా కాస్త ఎక్కువగానే ఉంటుంది. ఈ అరుణాచలం పరమేశ్వరుడిని జ్యోతిర్లింగా స్వరూపంగా భ‌క్తులు భావిస్తారు. ఇక్క‌డ ప్రదక్షిణం చేయటం సాక్ష్తాత్తు శివునికి ప్రదక్షిణం చేస్తున్న‌ట్లు భ‌క్తులు విశ్వ‌సిస్తారు.

kanipakam temple

ఈ ప్ర‌ద‌క్షిణ మొత్తం 14 కిలోమీటర్లు ఉంటుంది. ఈ దారిలో మొత్తం 8 లింగాలు ఉంటాయి. భ‌క్తుల ర‌ద్దీని దృష్టిలో ఉంచుకుని తెలంగాణ టూరిజం సరికొత్త ప్యాకేజీని అందుబాటులోకి తీసుకొచ్చింది. 'HYDERABAD - ARUNACHALAM - Telangana Tourism' పేరుతో ఈ టూర్ ప్యాకేజీని ఆపరేట్ చేస్తోంది. హైదరాబాద్ నుంచి రోడ్డు మార్గం ద్వారా అరుణాచలానికి తీసుకెళ్తుంది. ఇది మొత్తం నాలుగురోజుల టూర్ ప్యాకేజీ. పెద్దలకు రూ. 7500గా టికెట్ ధరను నిర్ణయించారు. చిన్న పిల్లలకు రూ. 6000 చెల్లించాలి. ఈ టూర్ ప్యాకేజీ మే 20వ తేదీన అందుబాటులో ఉంటుంది.

ఈ టూర్ ప్యాకేజీ వివరాలు ఇలా ఉన్నాయి..

తెలంగాణ టూరిజం HYDERABAD - ARUNACHALAM - Telangana Tourism టూరిజం పేరుతో ఈ ప్యాకేజీని ప్రకటించింది. మే 20వ తేదీ నుంచి ఈ ప్యాకేజీ అందుబాటులో ఉంటుంది. అనంత‌రం జూన్ లో ప్యాకేజీ ప్ర‌యాణికుల‌కు అందుబాటులో ఉంటుంది. పెద్దలకు రూ. 7500 చెల్లించాలి. పిల్లలకు రూ. 6000గా నిర్ణ‌యించారు.

thiruvannamalai1

నాలుగు రోజుల టూర్ వివ‌రాలు ఇలా ఉన్నాయి..

మొదటి రోజు సాయంత్రం 6:30 నుంచి బషీర్ బాగ్ నుంచి బ‌య‌లుదేరాల్సి ఉంటుంది. రెండో రోజు ఉదయం కాణిపాకం చేరుకోవాల్సి ఉంటుంది. ఆ త‌ర్వాత ఉద‌యం 9 గంటల లోపు కాణిపాకం వినాయ‌కుని దర్శనం పూర్తి అయిన అనంత‌రం Thiruvanamalaiకి బయల్దేరుతారు. అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు అరుణాచలం చేరుకుంటారు. దర్శనం పూర్తి అయిన త‌ర్వాత ఆ రోజు రాత్రికి అరుణాచలంలోనే బ‌స చేయాల్సి ఉంటుంది. మూడో రోజు ఉద‌యం టిఫిన్ పూర్తిచేసుకున్నాక‌ వేలూరుకు బ‌య‌లుదేరుతారు.

arunachalam park

అక్క‌డినుంచి శ్రీ‌పురం గోల్డెన్ టెంపుల్ ద‌ర్శ‌నం చేసుకుందాం. అదే రోజు సాయంత్రం నాలుగు తర్వాత హైదరాబాద్ బయల్దేరుతారు. నాలుగో రోజు ఉదయం 5 గంటలకు హైదరాబాద్ కు చేరుకోవటంతో ఈ టూర్ ప్యాకేేజీ ముగుస్తుంది. ఈ ప్యాకేజీకి సంబంధించి ఏమైనా ఇత‌ర‌ సందేహాల కోసం ఈ వెబ్‌సైట్‌ను https://tourism.telangana.gov.in/p సంప్ర‌దించ‌గ‌ల‌రు. ఈ వెబ్‌సైట్ ద్వారానే ప్యాకేజీని బుక్‌ చేసుకోవచ్చు. ఇత‌ర పూర్తి వివరాలను కూడా తెలుసుకోవచ్చు.

More News

Read more about: hyderabad telangana
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+