తక్కువ బడ్జెట్తో మధ్యప్రదేశ్లోని ఈ ప్రాంతాలను చూసేయొచ్చు..
మధ్యప్రదేశ్ చాలా అద్భుతమైన ప్రదేశం. ఇక్కడ సందర్శించేందుకు చాలా అందమైన ప్రదేశాలు ఉన్నాయి. వాటి అందం పర్యాటకులను మరో ప్రపంచంలోకి తీసుకెళ్తుంది. ఈ ప్రాంతం ప్రకృతి ప్రేమికులైనా, వన్యప్రాణుల ప్రేమికులైనా లేదా చరిత్ర ప్రేమికులైనా ప్రతి ఒక్కరిని సాదరంగా ఆహ్వానం పలుకుతుంది. ఎప్పుడైనా ఇక్కడకు రావడానికి ప్లాన్ చేసుకోవచ్చు. అది కూడా అతి తక్కువ బడ్జెట్తో మధ్యప్రదేశ్లోని ఈ ప్రాంతాలను సందర్శించేయొచ్చు. రండి. ఇంతకీ మధ్యప్రదేశ్లోని ఆ ప్రదేశాలేంటో చూద్దాం..

ఖజురహో
ఖజురహో మధ్యప్రదేశ్లోని బుందేల్ఖండ్ ప్రాంతంలో ఉంది. ఇది భారతదేశంలోనే కాకుండా దేశ విదేశాలలో కూడా పురాతన దేవాలయాలకు ప్రసిద్ధి చెందింది. ఖజురహోలో పశ్చిమ, తూర్పు, దక్షిణ దేవాలయాల సమూహాన్ని చూడొచ్చు. ఇక్కడ ఒక పురాతన చెరువు కూడా ఉంది. ఇక్కడ నుండి సూర్యాస్తమయపు అద్భుతమైన దృశ్యాలను చూడొచ్చు. ఈ ప్రాంతం దేవాలయాలకు మాత్రమే ప్రసిద్ధి చెందడమే కాకుండా, ఇక్కడ అనేక జలపాతాలను కూడా పేరుగాంచింది. రానేహ్ జలపాతం, గ్రాండ్ కాన్యన్, కెన్ ఘరియాల్ అభయారణ్యం వంటి అనేక అద్భుతమైన ప్రదేశాలను కూడా అన్వేషించవచ్చు. చాలా తక్కువ బడ్జెట్లో మధ్యప్రదేశ్లోని ఈ ప్రాంతాన్ని సందర్శించవచ్చు.

ఓర్చా
ఓర్చా కోట భేత్వా నది మధ్యలో ఉన్న దీవిలో ఉంటుంది. అందుకే చిన్న చినుకు పడినా, ఈ నదిని ఆనుకుని ఉన్న కట్టడాలకు కొత్త శోభ వస్తుంది. జహంగీర్ మహల్, ఫూల్ బాగ్, రాయి ప్రవీణ్ మహల్, రాజమహల్, రాణిమహల్, సందర్మహల్, లక్ష్మీనారాయణ ఆలయం ఇలా ఇక్కడ వేసే ప్రతి అడుగులోనూ ఓ సరికొత్త చారిత్రక నిర్మాణం దర్శనమిస్తుంది. ఇక్కడి ఏ గోడలను తాకినా ఒక్కో ప్యాలస్కు ఒక్కో చరిత్ర ఉంటుంది. ఝాన్సీ రైల్వే స్టేషన్ నుంచి దాదాపు 25 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ ఓర్చా. అలాగే గ్వాలియర్ విమానాశ్రయం నుంచి 120 కిలోమీటర్ల దూరంలో ఉంది. ఓర్చాకు నేరుగా విమాన కనెక్టివిటీ లేదు. సమీప దేశీయ విమానాశ్రయం గ్వాలియర్ విమానాశ్రయం. ఓర్చా కోటను బుందేల్ ఛీఫ్తన్ రుద్రప్రతాప్ నిర్మించారు. గుప్తుల కాలానికి చెందిన ఈ నిర్మాణం పురాతత్వ ప్రాముఖ్యతను సంతరించుకుంది.

మండు
మండు ఇండోర్ నగరానికి కేవలం 90 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఓ అద్భుతమైన ప్రదేశం. చరిత్ర ప్రేమికుల కోసం ఇక్కడ అనేక చారిత్రక కట్టడాలు అందుబాటులో ఉన్నాయి. దీని వెనుక కథ కూడా చాలా ఉత్కంఠభరితంగా ఉంటుంది. జేబులో ఉన్న రెండు నుంచి ఐదు వేల రూపాయలతో మధ్యప్రదేశ్లో ఉన్న ఈ ప్రాంతాన్ని సందర్శించొచ్చు. మాండులో, హిందోలా మహల్, జహాజ్ మహల్, హోషాంగ్ షా సమాధి, జామా మసీదు, బాజ్ బహదూర్ ప్యాలెస్, చంపా బవోలి, అష్రాఫీ మహల్ వంటి అనేక ప్రదేశాలు ఉన్నాయి.
చందేరి
చందేరి అనేది మధ్యప్రదేశ్లోని ఒక చిన్న పట్టణం. ఇది భారతీయ చరిత్రలో దాని ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఇది గ్వాలియర్ రాజకుటుంబంచే ప్రోత్సహించబడిన అతిపెద్ద నేత పరిశ్రమలో ఒకటి. అందమైన రంగులు, జరీ వర్క్తో, చందేరీ నేత జాతి బట్టల ప్రేమికులను ఆకట్టుకోవడంలో ఎప్పుడూ ముందుంటుంది. ఇక్కడ వీధిలోని ప్రతి నాల్గవ ఇల్లు మగ్గంతో నింపబడి ఉంటుంది. చందేరిని మెట్ల బావుల నగరం అని కూడా అంటారు. చందేరిలో కోట, బాదల్ మహల్, జామా మసీదు, కటి ఘాటి, రాంనగర్ మహల్, కౌషక్ మహల్, రాజా రాణి మహల్ చందేరి మ్యూజియం వంటివి చూడొచ్చు.



Click it and Unblock the Notifications













