రాస్ హిల్ ను కన్యమరి కొండ అని కూడా అంటారు.మరియు తూర్పు ఘాట్ అన్ని శిఖరాలకు మధ్య ఎత్తైనది.ఇక్కడ మూడు కొందలు వున్నాయి.ఒక్ కొండపై వెంకటేశ్వర స్వామి, ఒక కొండప్ ముస్లిములకు పవిత్రమైన దర్గా, మరొక కొండపై (రాస్ కొండ) క్రైస్తవులకు పవిత్రమైన ఛర్చి వున్నాయి.
విశాఖపట్నంలోని ఈమూడు మతాల పవిత్ర ప్రదేశాలు చూడటం ఒక మధురానుభూతి. భారత దేశ మతాతీత రాజ్యాంగానికి చక్కని ఉదాహరణ. ఆ కొండ మీద Mr రాస్ అనే ఆంగ్లేయుడు ఇల్లు కట్టుకొని ఉండుట వల్ల ఈ కొండకు రాస్ హిల్ అనే పేరు వచ్చింది.ఆ తర్వాతి కాలంలో ఆ ఇల్లు ను అవర్ లేడీ అనే పేరుతొ ఒక ప్రార్థనాలయం గా మార్చబడింది.ప్రార్థనాలయం లో వివిధ కాథలిక్ చిహ్నాలు మరియు చిత్రాలు అలంకరించబడి ఉన్నాయి.ఈ కొండ మీద నుంచి బీచ్, ఓడరేవు మరియు నౌకానిర్మాణం యార్డ్ లను చుస్తే పర్యాటకులకు చాలా ఆనందం కలుగుతుంది.