1869 - 1872 మధ్య భారతదేశ రాజప్రతినిధి గా పనిచేసిన 6వ ఎర్ల్ ఆఫ్ మాయో, భారత రాజ కుటుంబీకులకు బ్రిటిష్ ప్రమాణాల విద్యనూ అందించడానికి మాయో కాలేజ్ ను స్థాపించాడు. భారతదేశ సంపన్న కుటుంబాలకు, ముఖ్యంగా రాజపుత్రులకు విద్యను అందించడానికి బ్రిటిష్ వారు ఈ పాఠశాల ను స్థాపించారు.
జైపూర్ ప్రభుత్వ ఇంజనీర్, సర్ శ్యామూల్ స్విన్టన్ జాకబ్ ప్రచారం చేసిన కళాశాల ప్రధాన భవనం నమూనాను ఇండో సరాసేనిక్ శైలిలో మేజర్ మాంట్ రూపొందించాడు. తెల్లని పాలరాయితో తయారుచేయబడిన ఈ భవనం ఇండో-సరాసేనిక్ నిర్మాణ శైలికి ప్రధాన ఉదాహరణ.
ఈ భవనం 1877, 1885 మధ్య ఎనిమిది సంవత్సరాలలో నిర్మించారు. ఝలావర్ హౌస్ లోపలున్న మ్యూజియం లో అనేక ప్రాచీన వస్తువులు, ఆయుధాగార విభాగాలు ఉన్నాయి. ఈ కళాశాల జాతీయ చిహ్నం లాహోర్, స్కూల్ ఆఫ్ ఆర్ట్స్ మాజీ ప్రిన్సిపాల్ లాక్వుడ్ కిప్లింగ్ చే తయారుచేయబడింది. అతను ప్రముఖ రచయిత రడ్యార్డ్ కిప్లింగ్ తండ్రి.