సుచింద్రం, తమిళనాడు రాష్ట్రంలో కన్యాకుమారి జిల్లాలో ఉన్నఒక ఆధ్యాత్మిక మరియు ప్రశాంతకరమైన ప్రముఖ పట్టణం. ఇక్కడ థనుమలయన్ దేవాలయం ఉండటం వలన దీనికి చాలా ప్రాముఖ్యత ఉన్న ప్రదేశంగా పేరు వొచ్చింది. పురాతన కాలంలో, ఈ పట్టణం ట్రావన్కోర్ పట్టణానికి ఒక కోటలాగా ఉండేది.
ఉత్సవ ఔత్సుక్యముఈ ప్రదేశంలో రెండు పండుగలు; మార్కజ్హి మరియు చిథ్థిరై చాలా వైభవంగా జరుపుకుంటారు. తమిళనాడు లోని ప్రజలు మరియు ఇరుగుపొరుగు రాష్ట్రాలనుండి కూడా ఈ పండుగలలో పాల్గొనటానికి సుచింద్రం వొస్తారు. 'మార్కజ్హి' పండుగను డిసెంబర్ లేదా జనవరి నెలలో; శీతాకాలంలో జరుపుకుంటారు. పండుగ వేడుకలు తొమ్మిది రోజులు ఘనంగా జరుపుకుంటారు, చివరి రోజు హిందూ దేవతలను మూడు పండుగ రథాలలో ఉంచి, పట్టణమంతా ఊరేగిస్తారు. 'చిథ్థిరై' పండుగను ఏప్రిల్ మరియు మే నెలలలో జరుపుకుంటారు.
దేవాలయాలు మరియు దేవుళ్లుఈ పట్టణం థనుమలయన్ దేవాలయానికి ప్రసిద్ధి చెందినప్పటికీ, ఇక్కడ ఇతర ఆలయాలు కూడా ఉన్నాయి. ఇక్కడ ద్వారకా కృష్ణన్ ఆలయం, మునుథితనంకై ఆలయం, ఆశ్రమం శాస్త ఆలయం, కరుపసామి కొఇ ఠమొఉరన్ ఠమ్పురతి దేవాలయం అక్కారై ఆలయం, ఆస్రమ్మమ్ ఆఉసుయ మరియు ఆత్రి మునివర్ హోమ కుందం హి, స్రమమరులికు శ్రీ భూతతన్మాద్ అంతంపుర మేనస్కి అమ్మాన్ కోవిల్, ముతరమ్మన్ ఆలయం మరియు ఫెరమబలమ్ నటరాజర్ ఆలయం ఉన్నాయి.
ఇన్ని దేవాలయాలు ఇక్కడ ఉన్నప్పటికీ, థనుమలయన్ దేవాలయంలో ఉన్న మూడు రకాల దేవుళ్ళ మహిమ గొప్పతనం వలన పర్యాటకులకు ఇది ఒక ప్రముఖ యాత్రా స్థలంగా ఉన్నది.సుచింద్రంలో ఉన్న ప్రముఖ స్థలాలు థనుమలయన్ దేవాలయం మరియు సుచింద్రం సమీపంలో ఉన్న చారిత్రాత్మక పట్టణం 'కోలచెల్'. సుచింద్రం దగ్గరగా ఉన్న విమానాశ్రయం 'తిరువంతపురం ఎయిర్ పోర్ట్' మరియు దగ్గరలో ఉన్న రైల్వే స్టేషన్ 'కన్యాకుమారి రైల్వే స్టేషన్'. దక్షిణ భారత పెద్ద నగరాల నుండి సుచింద్రం కు డైరెక్ట్ గా బస్సులు ఉన్నాయి. ఒక్క వేసవిలో తప్ప ఇక్కడి వాతావరణం సంవత్సరమంతా సమంగా ఉంటుంది. వేసవిలో చాలా వేడిగా ఉంటుంది.