అహ్మద్ నగరంలో బాగ్ రౌజా ఒక చారిత్రక చిహ్నం. దీనినే గార్డెన్ ఆఫ్ ష్రైన్ అంటారు. దీనిలో అహ్మద్ నిజాం షా సమాధి ఉంటుంది. అహ్మద్ నగర స్ధాపన ఘనత నిజామి రాజుకు దక్కింది. ఆయన 16వ శతాబ్దం మొదటి భాగంలో మరణించాడు. ఈ స్మారక చిహ్నాన్ని నల్లరాతితో ఢిల్లీ గేటుకు సమీపంలో నిర్మాణం చేశారు. దీని గోపురంపై అందమైన రీతిలో బంగారంతో ఖురాన్ గ్రంధం నుండి కొన్ని వాక్యాలను లిఖించారు. ఈ ప్రదేశానికి మీరు చేరినపుడు గులాం ఆలి సమాధిని కూడా దర్శించండి. గులాం ఆలి ఒక రాచరికపు ఏనుగు. సుమారు 1565 ప్రాంతంలో విజయనగర రాజులతో జరిగిన యుద్ధంలో ఈ ఏనుగు మరణించింది. దాని స్మారకార్ధం ఈ సమాధిని కట్టారు. బాగ్ రౌజాకు రోడ్డు ప్రయాణంలో తేలికగా చేరవచ్చు. పర్యాటకులు టాక్సీ లేదా బస్ ద్వారా ఈ ప్రదేశానికి చేరవచ్చు.



Click it and Unblock the Notifications