అహ్మద్ నగర్ లో సలాబత్ ఖాన్ సమాధి తప్పక చూడదగినది. సముద్ర మట్టానికి 900 మీటర్ల ఎత్తున ఒక కొండపై కల ఈ నిర్మాణం షా దొంగార్ అని పిలువబడుతుంది. దీనినే చాంద్ బీబి మహల్ అని కూడా పిలుస్తారు. సలాబత్ ఖాన్ ఈ స్మారక చిహ్నాన్ని స్వంతంగా కట్టించుకొన్నాడు. సలాబత్ ఖాన్ 4వ నిజాం షా అయిన ముర్తజా క్రింద 1565 నుండి 1579 వరకు మంత్రిగా పదవి నిర్వహించాడు. ప్రఖ్యాత చెంగిజ్ ఖాన్ చేతిలో ముర్తజా మరణం జరిగింది. సమాధికిగల గోపురం చాలా పెద్దది, అందమైనది. ఎంతో దూరం నుండి కూడా దీనిని చూడవచ్చు. దీనికి మూడు అంతస్తుల వరండా ఒకటి నిర్మించారు. సమాధిని కూడా అష్టభుజి ఆకారంలో నిర్మించారు. దీనిలో సలాబత్ ఖాన్ అవశేషాలు ఉంటయి. ఈ సమాధి కిందే అతని ఇరువురి భార్యల మరియు కుమారుడి మృతదేహాలను కూడా సమాధి చేశారు.



Click it and Unblock the Notifications