గురుద్వారా బాబా అటల్ గోల్డెన్ టెంపుల్ కు దక్షిణంగా సిటీ మొత్తానికి ఎత్తుగా కనపడుతుంది. రెండు వందల ఏళ్ల కిందట నిర్మించిన ఈ నిర్మాణం బాబా అటల్ రాయి సమాధి. ఈయన గురు హర గోవింద్ జి కుమారుడు. సుమారు 40 మీ. ల ఎత్తు కల ఈ టవర్ లో తొమ్మిది అంతస్తులు ఈ గురుద్వారా గ్రౌండ్ ఫ్లోర్ లో నాలుగు ద్వారాలుంటాయి. ప్రధాన ద్వారం తూర్పు ముఖం లో వుంటుంది. బాబా అటల్ తయారు చేసిన భోజనం పంపుతాడనే నినాదం తో ఇది ఎపుడూ తెరిచే వుంటుంది. ఈ అద్భుత శిల్ప శైలి అమ్రిత్సర్ లో తప్పక చూడాలి.