గురుద్వారా బిబెక్సర్ సాహిబ్ బిబెక్సర్ సరోవరం ఒడ్డున కలదు. దీనిని ఆరవ సిక్కు గురు గురు హర గోవింద్ జి 1628లో నిర్మించారు. అందమైన ఈ గురుద్వారాను మహారాజ రంజిత్ సింగ్ పవిత్ర కొలను పక్కన గురు హరగోవింద్ జి విశ్రాంతి తీసుకునే ప్రదేశంలో నిర్మించారు. ఈ ప్రదేశం లోనే ఆయన సాయంత్రపు సమావేశాలు నిర్వహించటం, పండితులతో చర్చలు చేయటం చేసేవారు. అందమైన ఈ పర్యావరణంలోకల గురుద్వారాలో గురు హరగోవింద్ జి తన విశ్రాంతి సమయం గడిపే వారు. ట్యాంక్ చివర కల కరీర్ చెట్టు కు ఆయన తన గుర్రాన్ని కట్టేవారు. ఇప్పటికి ఆ చెట్టు కలదు. ఇపుడు శిరోమణి గురుద్వారా ప్రభంధక్ కమిటీ చే నిర్వహించబడే గురుద్వారా బిబెక్సర్ సాహిబ్ ప్రతి నెల చివరి శనివారం తప్పక చూడదగినది.