శ్రీనగర్ కి 25 కి.మీ దూరం లో గల పరిహాస్పురా టవును బారాముల్లా లో ప్రసిద్ధికెక్కిన దర్శనీయ స్థలం. ఇది రాజా శంకర్ వర్మన్ కాలం లో కాశ్మీరు రాజధానిగా ఉండేది. దీనిని కాశ్మీరుని పరిపాలించిన మొట్టమొదటి రాజులలో ఒకరైన లలితాదిత్య ముక్తపిడ్ క్రీ.శ. ఎనిమిదవ శతాబ్దంలో కనుగొన్నాడు.
బారాముల్ల పురాతన స్మారక చిహ్నాలు గల "పటాన్ బజార్","పరిహాస్పొరా పట్టన్" లు ప్రసిద్ధి. బౌద్ధుల స్థూపం మరియు బౌద్ధ మఠ ఆనవాళ్ళని కూడా బారాముల్లా సందర్శకులు దర్శించవచ్చు. రాజ్ భవన్, కొన్ని విష్ణాలయాలు,చైత్య,బుద్ధ/జైన్ ఆలయాలు పరిహాస్పురా లో జరిగిన 1914 తవ్వకాలాలలో బయట పడ్డాయి. తవ్వకాలలో బయల్పడిన కట్టడాలు పురాతన నిర్మాణ శైలిని ప్రతిబింబిస్తాయి.



Click it and Unblock the Notifications