పాలి పట్టణాన్ని పారిశ్రామిక నగరం అని కూడా అంటారు. ఇది రాజస్ధాన్ రాష్ట్రంలో కలదు. పాలి జిల్లాకు పాలి జిల్లా ప్రధాన కార్యాలయం. ప్రసిద్ధి చెందిన ఈ యాత్రిక ప్రదేశం బండి నది ఒడ్డున కలదు. గతంలో దీనిని పల్లిక లేదా పల్లి అనేవారు. ఈ ప్రదేశానికి ఈ పేరు పాలివాల్ బ్రాహ్మణుల కారణంగా వచ్చింది. పురాతన కాలంలో వారు ఈ ప్రదేశంలో నివసించేవారు. ఈ ప్రదేశంలో అనేక వస్త్ర తయారీ పరిశ్రమలు కలవు. ప్రాచీన కాలంనుండి ఇక్కడ వస్త్ర తయారీ వ్యాపారం జరుగుతోంది.
ఈ ప్రదేశం జైన దేవాలయాలకు, కోటలకు, తోటలకు, మ్యూజియంలకు ప్రసిద్ధి. పాలిలో కల నవలక దేవాలయం ఇక్కడి పుణ్య క్షేత్రాలలో ఒకటి. దీనిని నౌలఖ జైన దేవాలయం అని కూడా అంటారు. ఇది. అందమైన శిల్పశైలికి ప్రసిద్ధి. ఈ జైన దేవాలయంలో 23వ తీర్ధంకరులుంటారు. పాలిలో పరశురామ్ మహాదేవ్ దేవాలయం, చాముండ మాత దేవాలయం, సోమనాధ్ దేవాలయం, హటుండి రత మహాబీర్ స్వామి దేవాలయాలు కూడా కలవు.
దేవాలయాలే కాకుండా, బంగూర్ మ్యూజియం కూడా పలిలో చూడతగిన ప్రదేశం. ఈ మ్యూజియం నగరంలోని పాత బస్ స్టాప్ కు సమీపంలో కలదు. పర్యాటకులు ఇక్కడ అరుదైన వస్తువులను పురాతన నాణేలను, రాచ దుస్తులు, బంగారు నగలు వంటివి చూడవచ్చు. ఇక్కడే కల లఖోటియా గార్డెన్ కూడా చూడవచ్చు. ఇది నగరం మధ్య లో కలదు. ఈ గార్డెన్ లో ఒక శివాలయం కలదు. అనేక మంది భక్తులు దీనిని సందర్శిస్తారు.
పాలిలో అనేక దిగుడు బావులు కలవు. వీటిని స్ధానికులు బవోరి లు అంటారు. సోజత్ కూడా ఒక పర్యాటక ఆకర్షణ. ఇక్కడ హెన్నా అనే ఔషధ మొక్క సాగవుతుంది. దీనినే గోరింటాకు అంటారు. దీనితో చర్మంపై రంగుల డిజైన్లు వేసుకోవచ్చు. నింబో కా నాధ్, అదీశ్వర్ దేవాలయం సూర్య నారాయణ దేవాలయం కూడా ప్రసిద్ధి చెందినవి.
పాలి వాయు, రైలు, మరియు రోడ్డు మార్గాలలో చేరవచ్చు. జోధ్ పూర్ సమీప విమానాశ్రయం. ఇక్కడినుండి ఢిల్లీ, బెంగళూరు, కోల్ కటా, ముంబై లకు తరచుగా విమానాలు కలవు. పర్యాటకులు ట్రైన్ లో కూడా చేరవచ్చు. జాతీయ రహదారి 111 పాలి ని బిలాసపూర్ మరియు అంబికాపూర్ ల వద్ద కలుపుతుంది. పర్యాటకులు పాలి నుండి జోధ్ పూర్, ఉదయపూర్ లకు బస్ సర్వీసులు కూడా ఉపయోగించుకోవచ్చు.
పాలి వాతావరణం వేడితో కూడి పొడిగా ఉంటుంది. ఇది ఒక ఎడారి ప్రాంతంలో కలదు. వేసవిలో గరిష్ట ఉష్ణోగ్రత 46 డిగ్రీ సెల్షియస్ వరకు చేరుతుంది. పాలి సందర్శనకు శీతాకాలం అనువైనది. అక్టోబర్ నుండి ఫిబ్రవరి వరకు గల ఆహ్లాదకర వాతావరణంలో పాలి సందర్శన పర్యాటకులకు సంతోషాన్నిస్తుంది.