మేవార్ర్ అపోలో గా ప్రసిద్ధి కెక్కిన నాధ్ ద్వారా రాజస్ధాన్ లోని ఉదయపూర్ జిల్లాలో బనాస్ నది ఒడ్డున కలదు. కళ మరియు కళా ఖండాల ప్రదేశం ఈ పట్టణం ప్రసిద్ధి గాంచిన పిచ్చవాయి పెయింటింగులకు రంగు రంగుల టెర్రకోటా ఉత్పత్తులకు పేరు పడింది. ఈ ప్రాంత కళా పనితనం సుమారుగా రెండు వేల సంవత్సరాల క్రిందటిది. అన్ని కళలలోకి మీనా వర్క్ ఈ ప్రాంతంలోని ప్రధాన ఆకర్షణ. ఈ ప్రదేశాన్ని సందర్శించే పర్యాటకులు సాంప్రదాయ కళా వస్తువులకు చక్కగా షాపింగ్ చేసుకోవచ్చు.
పురాతన దేవాలయాలు నాధ్ ద్వారా కళామ తల్లికి నిలయమే కాక హిందువుల ఆరాధ్య దైవాలు క్రిష్ణడు, విష్ణు మూర్తి మరియు ఆయన అవతారాలకు కూడా నిలయంగా ఉంది. నాధ్ ద్వారా సందర్శించే పర్యాటకులు విష్ష్ణు మూర్తి అవతారమైన ద్వారకాధీష్ దేవాలయాన్ని తప్పక దర్శించాలి. ఈ దేవాలయం లోని విగ్రహం ఎర్రటి రాతితో ఒకే పాలరాతితో చెక్కబడింది. ఈ ప్రాంతంలో శివ భగవానుడి ఏక్ లింగి దేవాలయం పర్యాటకులకు ప్రసిద్ధిగాంచిన పుణ్య క్షేత్రం. ఈ దేవాలయంలోని విగ్రహం చాలా పురాతనమైనదిగాను సుమారు 15 వ శతాబ్దానికి చెందినదిగాను చెపుతారు. సోమవారాలు ఇక్కడ జరిగే ప్రత్యేక పూజలకు భక్తులు అధికంగా వచ్చి తమ పూజలు చేయించుకుంటారు. రాజసమండ్, సాహిత్య మండల్ లైబ్రరీ మరియు సన్వారియా సేధ్ వంటివి ఈ ప్రాంతంలో మరిన్ని పర్యాటక ఆకర్షణలు.
నాధ్ ద్వారా ఎలా చేరాలి? నాధ్ ద్వారా విమానం, రైలు లేదా రోడ్డు ప్రయాణంలో చేరవచ్చు. మహారాణా ప్రతాప్ విమానాశ్రయం లేదా ఉదయపూర్ లోని డబోక్ విమానాశ్రయం ద్వారా ఈ ప్రాంతానికి చేరవచ్చు. విదేశీ పర్యాటకులు న్యూఢిల్లీలోని ఇందిరాగాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుండి చేరాలి. ఉదయపూర్ రలు స్టేషన్ ద్వారా కూడా చేరవచ్చు. రైలు స్టేషన్, విమానాశ్రయాలనుండి బస్సులు, క్యాబ్ లు లభ్యంగా ఉంటాయి. బస్ ప్రయాణం చేయగోరే వారు అహ్మదాబాద్, ఉదయపూర్, పుష్కర్, ఢిల్లీ, అజ్మీర్, జైపూర్ లనుండి కూడా చేరవచ్చు. నాధ్ ద్వారా ప్రాంతం సంవత్సరం పొడవునా అధిక వాతావరణం కలిగి ఉంటుంది. ఈ ప్రాంతాన్ని సందర్శించాలంటే అక్టోబర్ నుండి మార్చి వరకు అనుకూలం. అయితే పర్యాటకులు జరూలై మరియు సెప్టెంబర్ ల మధ్య కూడా చిన్నపాటి విహారాలు పెట్టుకోవచ్చు.