ఇక్కడ కల దశావతార టెంపుల్ ఉత్తర భారత దేశం లోనే పురాతన మైనది. ఈ గుడి విష్ణు మూర్తిది. దీనిని గుప్తుల కాలం లో నిర్మించారు. టెంపుల్ చాలా వరకూ సిదిలమైనప్పటికి, దీనిలో విష్ణు మూర్తి పది అవతారాలను , మాతలు గంగ యమునా లను దేవాలయ ప్రాంగణం లో చెక్కబడిన శిల్పాలు గా చూడవచ్చు....
కీర్తి గిరి దుర్గ కోటను చండేలా రాజు కీర్తి వర్మన్ 1057 లో నిర్మించాడు. మరొక కధనంగా, ఈయనకు ముందు అంటే 9 వ శతాబ్దం లోనే కన్నౌజ్ కు చెందినా ప్రతీహార పాలకులు దీనిని నిర్మించినట్లు కూడా చెపుతారు. చివరకు ఇది గ్వాలియర్ పాలకులు సిందియా కుటుంబం చేతుల్లోకి వచ్చింది. కోట కు...
రాజ్ ఘాట్ (కింగ్స్ స్టెప్స్) దేవ్ ఘర్ లో కల మూడు ఘాతల లోను ఒకటి. దీని గుండా కూడా బెట్వా నది చేరవచ్చు. ఈ ఘాట్లు దేవ్ ఘర్ కోట కంటే ఆకర్షనీయం. రాజ్ ఘాట్ హౌస్ లో అనేక శిల్పాలు గుప్త కాలం నాటివి చూడవచ్చు. ఈ ఘాట్లకు అర్కేయోలజికల్ ప్రాధాన్యత కలదు.
ప్రసిద్ధి చెందిన ఈ జైన దేవాలయాలు దేవ్ ఘర్ కోటకు సమీపంలో బెట్వా నది ఒడ్డున కలవు. ఈ టెంపుల్స్ సుమారు 8 మరియు 9 శతాబ్దాల నాటివిగా చెపుతారు. ఈ టెంపుల్స్ కోట లోపల, బయట కూడా కలవు. ఈ టెంపుల్ శిల్ప శైలి పురాతన భారత దేశ శిల్ప కాలాలకు నిదర్శనంగా వుంటుంది. టెంపుల్ గోడలపై...
బెట్వా నది సమీపం లో నహార్ ఘాట్, రాజ్ ఘాట్, సిద్ది కి గుహ అని మూడు స్నానపు ఘాట్లు కలవు. ఈ ప్రదేశం లో గుప్తుల కాలం నాటి శిల్పాలు, శాశనాలు కూడా అనేకం కనపడతాయి. మూడు ఘాతల లోకి నహార్ ఘాట్ బాగా ప్రసిద్ధి చెందినది. ఇక్కడ అనేక దేవతా మూర్తులను, లింగాలను కూడా దర్శించవచ్చు....
దేవ్ ఘర్ లో మూడు ప్రధాన ఘాట్లు కలవు. నహర్ ఘాట్, రాజ్ ఘాట్ , మూడవది సిద్ధి కి ఫుఫా మార్గం లోని ఘాట్. ఈ గుహ అంతా సాధారణంగా వుంటుంది. అయితే, కుడి వైపుగా పర్యాటకులు ఒక మహిషాసుర మర్దిని చిత్రాన్ని గుహ లో చూడవచ్చు. ఈ గుహ మార్గం గుండానే ఘాట్ కు వెళ్ళాలి.
గుప్తుల కాలం లో దేవ్ ఘర్ వైభవం లో వుండేది. పురావస్తు ఆసక్తి కల ప్రదేశం. అనేక తవ్వకాలు జరిగాయి. ఈ తవ్వ కాలలో గుప్తా రాజుల కాలం నాటి వైభవ చిహ్నాలు అనేకం బయట పడ్డాయి. వీటిని అన్నింటినీ మ్యూజియం లో భద్ర పరచారు.