కృష్ణా నది పైన నిర్మించబడిన బ్రిడ్జి ఈ ప్రకాశం బారేజ్.1223.5 మీటర్ల పొడవున్న ఈ నిర్మాణం గుంటూరు మరియు కృష్ణా జిల్లాలను కలపాలన్న ముఖ్య ఉద్దేశం తో జరిగింది. ఈ బారేజ్ చిన్న చెరువు పైన రోడ్ బ్రిడ్జి గా కూడా ఉపయోగపడుతుంది.ఈ బారేజ్ నుండి వచ్చే మూడు కాలువల వాళ్ళ విజయవాడ నగరం వెనిస్ నగరాన్ని తలపిస్తుంది.
1798 లో మొట్టమొదటి సారి కృష్ణా నది పైన బారేజ్ కట్టాలన్న ఆలోచన వొచ్చింది, కాని కృష్ణా డ్యాం నిర్మాణం మాత్రం 1852 లో ప్రారంభం అయ్యింది. ఈ ప్రాజెక్ట్ పుర్తవ్వడానికి మూడు సంవత్సరాలు పట్టింది. 1956 లో బారేజ్ కట్టాలన్న ఆలోచనని ఆచరణ లో పెట్టారు. గుంటూరు, విజయవాడ అలాగే పరిసర ప్రాంతాల రైతుల పొలాలకి ప్రధాన నీటి పారుదల వనరు గా ఈ ప్రకాశం బారేజ్ ని పేర్కొనవచ్చు. నిజానికి, ఈ బారేజ్ కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఆర్ధిక వ్యవ్యస్త ఎక్కువగా వ్యవసాయం మీద ఆధార పది ఉండడం వల్ల ఈ బారేజ్ కి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం రుణపడి ఉంది.
ఈ బారేజ్ నిర్మాణం వల్ల ఈ చుట్టు పక్కల ప్రాంతాల్లో ఏర్పడిన అందమైన సరస్సులు ఎంతో మంది పర్యాటకులని అమితంగా ఆకర్షిస్తున్నాయి.