దక్షిణ భారత దేశంలోని గుంటూరు జిల్లాలో కృష్ణా నది ఒడ్డున కల ఒక చిన్న పట్టణం అమరావతి. ఇక్కడ కల అమరేశ్వర టెంపుల్ కారణం గా ఈ ప్రదేశం ప్రపంచ వ్యాప్తంగా పేరు పొందింది. అంతేకాక, ఇక్కడ నిర్మించబడిన అతి పెద్ద బౌద్ధారామాల కారణంగా కూడా ప్రసిద్ధి కెక్కింది. ఈ బౌద్ధ స్తూపాలని మౌర్య సామ్రాజ్య స్థాపనకు ముందే నిర్మించారని విశ్వసిస్తారు. దీనిని అప్పట్లో ధాన్య కటకం లేదా ధరణికోట అని పిలిచేవారు. ఆంద్ర పాలకులలో మొదటి వారైన సాతవహనలుకు సుమారు క్రి. పూ. 2 వ శతాబ్దం నుండి 3వ శతాబ్దం వరకు వారి సామ్రాజ్యానికి రాజధానిగా వుండేది.
గౌతమ బుద్ధుడు తన కాలచక్ర ప్రక్రియను అమరావాతి లోనే బోధించాడు. దీనికి చారిత్రిక ఆధారాలు వజ్రాయన గ్రంధం లో పొందుపరచబడి వున్నాయి. ఈ కారణంగా అమరావతి పట్టణం క్రి. పూ సుమారు 500 సంవత్సరాల ముందు కూడా కలదని తెలుస్తోంది. నేడు ఈ పట్టణం, అమరావతి స్తూపం , పురావస్తు మ్యూజియం వంటి ఆకర్షణల కారణంగా ఒక చక్కని పర్యాటక ప్రదేశంగా ప్రసిద్ధికెక్కింది.
కృష్ణా నది తీరం ఒక విహార ప్రదేశంగా వేలాది పర్యాటకులని ఆకర్షిస్తోంది. ఈ పట్టణానికి రోడ్డు, రైలు, లేదా బోటు ల లో తేలికగా చేరవచ్చు. దీనికి సమీప ఎయిర్ పోర్ట్ విజయవాడ లో కలదు. రాష్ట్ర ప్రభుత్వ బస్సు లు రాష్ట్రం లోని వివిధ ప్రాంతాల నుండి అమరావతి కి నడుస్తాయి. ఈ ప్రదేశం సంవత్సరం పొడవునా ఉష్ణమండల వాతావరణం కలిగి, వేసవులు అధిక వేడి, పొడి గాని, చలి కాలాలు చలి గాను వుంటాయి. ఎన్నో ఆకర్షణలు కల ఈ ప్రదేశం, చారిత్రకులనే గాక పర్యాటకులని కూడా ఆకర్షిస్తోంది.