కృష్ణా నది తీరం ఎంతో ఆహ్లాదకరమైన నది తీరం. అమరావతి పట్టణాన్ని కృష్ణా నది ఒడ్డున నిర్మించారు. కనుక ఈ నది, ఆ పట్టణ వాసులకు ఎంతో ప్రాధాన్యత కలిగినది. మానవ నాగరికతలు అనేకం నదీ తీరాల లోనే విలసిల్లి చరిత్రలు సృష్టించినాయనేది ఒక వాస్తవం.
ఈ పట్టణం క్రీస్తు కు ముందే కలదు. కనుక ఈ పట్టణ ప్రజల జీవనంలో కృష్ణా నది శతాబ్దాల పాటు ప్రధాన పాత్ర పోషించింది. ఎంత కాలం గడిచినప్పటికీ ఈ నది విలువలని తగ్గించలేము. అది ఇంకా అమరావతి పట్టణానికి ఒక గొప్ప విలువైన ఆస్తి గా వుంది, వేలాది పర్యాటకులని సంవత్సరం లోని అన్ని కాలాల లోను ఆకర్షిస్తోంది.