సబ్బు రాయి (సోప్ స్టోన్)తో లేక క్లోరిటిక్ స్కిస్ట్ తో నిర్మించిన లక్ష్మీ నరసింహ స్వామి గుడి, సదాసశివాలయం వల్ల ప్రసిద్ది చెందిన హస్సన్ జిల్లా నుగ్గేహళ్లి పట్టణం యాత్రికులు తప్పక చూడాల్సిందే. కన్నడంలో నుప్పల్లి లేక నుగ్గుపల్లి అని పిలవబడే నుగ్గేహళ్లి తిప్తూర్ – చన్న రాయన పట్టణ రాష్ట్ర రహదారి పై హస్సన్ నుంచి 50 కిలోమీటర్ల దూరంలో వుంది. ఇక్కడి రెండు దేవాలయాలను హోయసలుల కాలం లో వీర సోమేశ్వర మహారాజు దగ్గర సేనాధిపతి గా పని చేసిన బొమ్మన్న దండనాయక అనే ఆయన కట్టించాడు.
త్రికూట (అంటే మూడు గోపురాలు), గోడలపై చెక్కిన అనేక శిల్పాలు, ఒక విమానం (అంటే ప్రార్ధన మందిరం) తో సహా లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయం 1246 లో నిర్మించబడింది. ఈ నిర్మాణం పూర్తయ్యాక ఒక పెద్ద మంటపం కట్టారు – మధ్యలో వుండే ఈ మంటపానికి మూడు పుణ్యక్షేత్రాలు, తొమ్మిది బాహ్య మంటపాలు వున్నాయి. నిలబడి వున్న పార్వతీ దేవి విగ్రహం ఇక్కడి ప్రధాన ఆకర్షణ.
నాగారం శైలి లో వుండే గోపురం తో సదాశివాలయాన్ని ఏకకూట నిర్మాణ శైలి లో నిర్మించారు. ఈ పుణ్య క్షేత్రం లోని గర్భ గుడిలో పెద్ద శివలింగం వుంది. రాతి గవాక్షాలతో కూడుకున్న ఒక పెద్ద గడిలో అందంగా చెక్కిన నంది విగ్రహం ఉంచారు.ఇక్కడికి చేరుకోగానే – అమ్మవారి గుడి వద్ద, శివాలయం బయట రెండు వినాయకుడి విగ్రహాలు వుండడం గమని౦చవచ్చు