మలై మహదేశ్వర కొండల సందర్శనలో అందమైన శివ భగవానుడి దేవాలయం పెద్ద ఆకర్షణ. ఈ ప్రాంతాన్ని ప్రకృతి ప్రియులు కూడా తప్పక చూడవలసినదే. అద్భుతమైన ఈ దేవాలయ కట్టడం దట్టమైన అడవుల సమీపంలో ఉంటుంది. ఈ ప్రాంత సందర్శనలో మీ శరీరం మరియు ఆత్మ రెండూ కూడా ఆనందాలను అనుభవిస్తాయి. ఆటవిక దేవాలయం మలై మహదేశ్వర కొండలు మైసూర్ పట్టణానికి సుమారు 140 కిలో మీటర్ల దూరంలో చామరాజ్ నగర్ జిల్లాలో ఉంటాయి. ఈ కొండలు సముద్ర మట్టానికి 3000 అడుగుల ఎత్తులో కలవు. మహదేశ్వర దేవాలయం ఎంతో అందమైనది. చుట్టూ కొండలు, అడవులు ఉంటాయి.
ఇతిహాసాల మేరకు, మహదేశ్వరుడంటే శివ భగవానుడి అవతారంగా కొలుస్తారను. స్ధానికులు శివుడు ఈ ప్రదేశంలో తపస్సు ఆచరించాడని ఇప్పటికి ఈ దేవాలయంలోని లింగంలో ఆవహించి ఉంటాడని విశ్వసిస్తారు. దేవాలయంలో అద్బుతం అంటే అక్కడ కల నిరంతరం ప్రవహించే నీటి బుగ్గ ఇది భూమి లోపలినుండి పైకి వస్తుంది. దీని మూల స్ధానం ఇంతవరకు కనిపెట్టబడలేదు.
మలై మహదేశ్వర కొండల అడవులు గంధపు మరియు వెదురు చెట్లు కలిగి ఉంటాయి. ఇక్కడ వన్యప్రాణులైన ఏనుగులు, చిరుతలు, లేడి, జింక, మరెన్నో జంతువులుంటాయి. ఈ కొండలలోని కొన్ని భాగాలలో గతంలో ఖ్యాతి కెక్కిన బందిపోటు గంధద వీరప్పన్ తలదాచుకునేవాడు. బెంగుళూరు మరియు మైసూర్ లనుండి మలై మహదేశ్వర కొండలను బస్సులలో చేరవచ్చు. వీటినే ఎం ఎం హిల్స్ అని కూడా అంటారు.