మూడవ నిజాం చే హైదరాబాద్ నగరం లో ఆంధ్ర ప్రదేశ్ స్టేట్ మ్యుజియం ఏర్పాటయింది. ఈ నగరం యొక్క అద్భుతమైన మరియు సంపన్నమైన చారిత్రక గతానికి సంబంధించి అంతర్ద్రుష్టి ని ఈ మ్యూజియం కలిగిస్తుంది. ఆ కాలం లో ఉన్న ఇండో సార్సెనిక్ శైలి లో నిర్మించబడిన ఈ మ్యుజియం 1928 లో ప్రారంభమయింది.
పబ్లిక్ గార్డెన్స్ లో నిర్మించబడిన ఈ మ్యూజియానికి ఔత్సాహికులైన సందర్శకులు ఎందరో ప్రతీ రోజు విచ్చేస్తూఉంటారు. బుద్ధుడు, అతని శిష్యుల జీవితాలకి సంబంధించిన గాలరీ ఈ మ్యూజియం లో ఉంది. లార్డ్ బుద్ధుడి కాలానికి సంబంధించిన ఎన్నో ప్రాచీన వస్తువులు ఈ మ్యూజియంలో గమనించవచ్చు. ఈ మ్యూజియంలో నాలుగు గదులు ఉన్నాయి. ప్రతి గదిలో మానవ నాగరికతకి సంబంధించిన దశలు కనిపిస్తాయి. నిర్దిష్ట కాలానికి సంబంధించిన వస్తువుల సేకరణ ప్రతి గదిలో గమనించవచ్చు.
హిందువుల మరియు జైనుల మతాలకు సంబంధించిన గెలరీ లు కూడా ఇక్కడ గమనించవచ్చు. రెండు మతాల నిర్మాణానికి సంబంధించిన వస్తువులు పురోగమిస్తున్న సమయంతో పాటు ఇక్కడ కనిపిస్తాయి. ఆధ్యాత్మిక ప్రాముఖ్యత కలిగిన వస్తువులని కూడా ఇక్కడ గమనించవచ్చు.



Click it and Unblock the Notifications